ETV Bharat / city

AP PRC ISSUE: కొత్త పే స్కేళ్ల ప్రకారమే ఉద్యోగుల జీతాల ప్రాసెస్‌..

author img

By

Published : Jan 29, 2022, 10:38 PM IST

PRC
PRC

కొత్త పే స్కేళ్ల ప్రకారం తక్షణమే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్‌ చేయాలని ట్రెజరీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. బిల్లులు ప్రాసెస్‌ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.

కొత్త పే స్కేళ్ల ప్రకారం తక్షణమే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్‌ చేయాలని ట్రెజరీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. బిల్లులు ప్రాసెస్‌ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. నేటి సాయంత్రం 6 గంటల వరకు బిల్లులు ప్రాసెస్‌ చేయని డీడీవోలు, ట్రెజరీ అధికారులపై చర్యలకు ఆదేశిస్తూ.. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మోమోలు జారీ చేశారు.

కొత్త పే స్కేళ్ల ప్రకారం జీతాల చెల్లింపు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

ఏ లెక్కల ప్రకారం పీఆర్సీ ఇచ్చారు ?: బండి శ్రీనివాసరావు

మరోవైపు పీఆర్సీ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఫిట్‌మెంట్‌ ఇంత తగ్గిస్తారనుకోలేదన్నారు. హెచ్‌ఆర్‌ఏలోనూ అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు. ఏ లెక్కల ప్రకారం పీఆర్సీ ఇచ్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా నెల్లూరు కలెక్టరేట్‌ వద్ద జరుగుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రిలే దీక్షల్లో బండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని కోరుతున్నామన్నారు. పన్నెండు సార్లు చర్చలకు వెళ్లినా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉద్యమానికి అన్నిసంఘాలు మద్దతిస్తున్నాయని శ్రీనివాసరావు తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటిపై మాట తప్పారని ఆరోపించారు. మరోవైపు పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.

అప్పటి దాకా నిరసనలు కొనసాగుతాయి: ఉద్యోగులు

విజయవాడలోని ధర్నాచౌక్‌ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిమాండ్లు నెరవేరిస్తేనే చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. చర్చల పేరిట ప్రభుత్వం కాలయాపన చేయడం మంచిది కాదని ఉద్యోగులు హెచ్చరించారు. పీఆర్సీ జీవోల్ని వెనక్కి తీసుకునే దాకా నిరసనలు కొనసాగుతాయని చెప్పారు. రిలే నిరాహార దీక్షలో వామపక్ష కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు.

ఇష్టమొచ్చినట్లు ఫిట్‌మెంట్‌ ప్రకటించారు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

విశాఖలో పీఆర్సీ సాధన సమితి మహిళా ఐకాస దీక్షలు నిర్వహిస్తోంది. దీక్షా శిబిరంలో పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. "నల్ల బ్యాడ్జీలతో వస్తే సీఎంతో చర్చలు కుదరవన్నారు. ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా ఫిట్‌మెంట్‌ ఎక్కువ ఇవ్వలేమన్నారు. ఫిట్‌మెంట్‌ వారికి ఇష్టమొచ్చినట్లు ప్రకటించారు. మేం ఒప్పుకున్నామంటూ ప్రచారం చేస్తున్నారు. మూడేళ్లుగా ప్రభుత్వం వద్ద మోసపోయాం" అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

ఇదీ చదవండి

AP Employees Protests: ఉద్ధృతంగా మారుతున్న పీఆర్సీ ఉద్యమం.. వారు సైతం సమ్మెలో..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.