ETV Bharat / business

కళ్లన్నీ వడ్డీ లెక్కలపైనే.. సెన్సెక్స్ 575​ పాయింట్లు పతనం

author img

By

Published : Apr 7, 2022, 3:40 PM IST

stock market news
స్టాక్ మార్కెట్ న్యూస్

Stock markets: అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య స్టాక్ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 575పాయింట్లు కోల్పోయింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 168 పాయింట్లు తగ్గింది.

Stock market news: భారతీయ స్టాక్​ మార్కెట్లు వరుసగా మూడో సెషన్​లో నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ ప్రతికూలతలు, విలీన ప్రకటనతో భారీగా పుంజుకున్న హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్ షేర్ల లాభాలను సొమ్ము చేసుకోవడం, శుక్రవారం వడ్డీరేట్లపై రిజర్వు బ్యాంకు ప్రకటనకు ముందు మదుపర్లు ఆచితూచి వ్యవహరించడం ఇందుకు కారణం.

  • బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 575​ పాయింట్లు కోల్పోయి 59,035 వద్ద స్థిరపడింది. గత రెండు సెషన్లలో కలిపి సెన్సెక్స్ 1001 పాయింట్లు నష్టపోయింది.
  • జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 168 పాయింట్లు తగ్గి 17,640 వద్ద ముగిసింది. గత రెండు సెషన్లలో కలిపి నిఫ్టీ 246 పాయింట్లు కోల్పోయింది.
  • హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, టైటాన్, విప్రో, టీసీఎస్, నెస్లే, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్, ఎన్​టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, సన్​ ఫార్మా లాభపడ్డాయి.
  • అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం ఖాయమన్న ఊహాగానాలు జోరందుకోగా.. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాటలో పయనించాయి. భారతీయ విపణులూ అదే బాటలో సాగాయి.
  • ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానంపై శుక్రవారం భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటన చేయనుంది. వడ్డీ రేట్లపై ఆర్​బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న అనుమానాల మధ్య మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
  • మరోవైపు.. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు ఊహాగానాల నేపథ్యంలో రూపాయి బలహీనపడింది. డాలరుతో పోల్చితే 22 పైసలు తగ్గి రూ.75.97గా ఉంది.
  • అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 1.71శాతం పెరిగి 102.8 డాలర్లకు చేరింది.
  • రూపాయి మారకం విలువ 12 పైసలు పడిపోయింది. ప్రస్తుతం డాలరుకు మారకం విలువ రూ.75.96గా ఉంది.

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.300 ప్రియమైంది. కేజీ వెండి కూడా రూ.300 మేర పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,335గా ఉంది. కిలో వెండి ధర రూ.68,106 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,335 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,106గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,335గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,106 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,335గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,106 వద్ద కొనసాగుతోంది.
• పెట్రోల్, డీజిల్ ధరల్లో గురువారం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్​లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.119.49, డీజిల్ ధర రూ.105.49గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.