ETV Bharat / business

మార్కెట్లపై బేర్​ పంజా.. సెన్సెక్స్​ 600 డౌన్​

author img

By

Published : Apr 25, 2022, 9:31 AM IST

Updated : Apr 25, 2022, 3:39 PM IST

stock-market-live-updates
స్టాక్​ మార్కెట్లు

15:26 April 25

మార్కెట్లపై బేర్​ పంజా.. సెన్సెక్స్​ 600 డౌన్​

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలకు తోడు ఐటీ, ఎంఎఫ్​సీజీ సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడితో దేశీయ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎఫ్​ఎంసీజీ ఇండెక్స్​ సుమారు 2 శాతానికిపైగా నష్టపోయాయి. ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించిన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. సెన్సెక్స్​ 617 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 17వేల దిగువకు చేరుకుంది.

  • బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ 617 పాయింట్ల నష్టంతో 56,580 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో.. 56,758 వద్ద ప్రారంభమైన సూచీ అమ్మకాల ఒత్తిడితో ఓ దశలో 56,357 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. ఆ తర్వాత 56,876 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి.. చివరకు 56,580 వద్ద స్థిరపడింది.
  • జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ- నిఫ్టీ 218 పాయింట్ల కోల్పోయి 16,954 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో.. 17,009 వద్ద ప్రారంభమైన సూచీ ఓ దశలో 16,889 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. ఆ తర్వాత కోలుకున్న సూచీ 17,054 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి చివర్లో అమ్మకాల ఒత్తిడితో 16,954 వద్ద ముగిసింది.

లాభనష్టాల్లోనివి: బజాజ్​ ఆటో, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఐసీఐసీ బ్యాంక్​, కొటమ్​ మహీంద్ర, హెచ్​డీఎఫ్​సీలు లాభాల్లో ముగిశాయి. కోల్​ఇండియా, బీపీసీఎల్​, టాటా స్టీల్​, ఎస్​బీఐ లైఫ్​ ఇన్స్యూరెన్స్​, హిందాల్కో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

  1. మార్కెట్ల నష్టాలకు కారణాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో దేశీయ మార్కెట్లపై ప్రభావం పడింది. ఏప్రిల్​ 22న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అలాగే చైనా, హాంగ్​కాంగ్​ నేతృత్వంలోని ఇతర ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లోకి వెళ్లటం వల్ల మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీశాయి.
  2. చైనాలో కరోనా కలకలం: ప్రపంచంలోనే రెండే ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో గత ఫిబ్రవరి నుంచి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చైనా జీరో కోవిడ్​ పాలసీతో విధించిన లాక్​డౌన్​ కారణంగా పరిశ్రమలపై ప్రభావం పడింది. చైనా జీడీపీ వృద్ధి తగ్గి అంతర్జాతీయ ఎగుమతులు, ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపనుందనే ఆందోళనలు మొదలయ్యాయి.
  3. ద్రవ్యోల్బణం: ఇండోనేసియా ముడి పామాయిల్​ ఎగుమతులపై నిషేధం విధించిన క్రమంలో ధరల పెరుగుదలపై మదుపరులు దృష్టిసారించారు. ఇప్పటికే భారత్​లో రిటైల్​ ద్రవ్యోల్బణం 7 శాతానికి చేరింది. ఇండోనేసియా నిర్ణయంతో ఆహారా వస్తువుల ధరల భారీగా పెరిగే అవకాశం ఉంది.
  4. వడ్డీ రేట్ల పెంపు: వచ్చే వారం జరగనున్న సమావేశంలో అమెరికా ఫెడరల్​ రిజర్వ్​ వడ్డీ రేట్లను 50 బేసిస్​ పాయింట్లు పెంచనుందనే ఆందోళనలు మార్కెట్లపై ప్రభావం చూపాయి.
  5. ఎఫ్​పీఐ: దేశీయ మార్కెట్లలో పతనానికి ప్రధాన కారణం విదేశీ సంస్థాగత మదుపరులు తమ సొమ్మును వెనక్కి తీసుకోవటమే. వరుసగా ఏడో నెలలోనూ భారీగా విదేశీ మదుపురులు అమ్మకాలు జరిపారు. అక్టోబర్​ నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.2 లక్షల కోట్లు దేశీయ మార్కెట్​ నుంచి తరలివేళ్లాయి. మరోవైపు.. రష్యా, ఉక్రెయిన్​ రెండు నెలలుగా కొనసాగుతుండటమూ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

09:21 April 25

stock market live updates

Stock markets: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 616 పాయింట్లు కోల్పోయి​ 56,581కి పడిపోయింది. నిఫ్టీ 191 పాయింట్లు క్షీణించి 16,981 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి అంచనాను అమెరికా 70 బేసిస్​ పాయింట్లు తగ్గింది 7 శాతానికి పరిమితం చేయడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. బజాజ్​ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్​, హీరో మోటోకార్ప్​, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బీపీసీఎల్​, బ్రిటానియా, హెచ్​యూఎల్​, టెక్​ మహీంద్ర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated :Apr 25, 2022, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.