ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లలో మళ్లీ జోష్​.. 58 వేల మార్కుకు చేరువలో సెన్సెక్స్​

author img

By

Published : Mar 29, 2022, 9:18 AM IST

Updated : Mar 29, 2022, 3:43 PM IST

stock market live updates
stock market live updates

15:42 March 29

Stock Market Close: దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుసగా రెండో సెషన్​లో లాభాలు నమోదుచేశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 350 పాయింట్లు పెరిగి 57 వేల 944 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 17 వేల 325 వద్ద సెషన్​ను ముగించింది. నేటి సెషన్​లో సూచీలు మొత్తం లాభాల్లోనే కదలాడాయి. తొలుత సెన్సెక్స్​ దాదాపు 220 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత కాస్త ఒడుదొడుకులకు లోనైనా సానుకూలంగానే ట్రేడయింది. ఓ దశలో దాదాపు 400 పాయింట్లకుపైగా పెరిగి 58,002 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. 57 వేల 639 వద్ద కనిష్ఠాన్ని తాకింది.

09:07 March 29

stock market live updates

స్టాక్​ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులతో సెన్సెక్స్ 221 పాయింట్లు వృద్ధి చెంది 57,815కి చేరింది. నిఫ్టీ 75 పాయింట్లు మెరుగుపడి 17,297 వద్ద ట్రేడవుతోంది. భారతీ ఎయిర్​టెల్, కోల్​ ఇండియా, యాక్సిస్​ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. యూపీఎల్, నెస్లీ, డా.రెడ్డీస్ ల్యాబ్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated :Mar 29, 2022, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.