ETV Bharat / business

ఆటో, బ్యాంకింగ్​ రంగాల ఊతం.. స్టాక్​ మార్కెట్లలో మళ్లీ జోష్​

author img

By

Published : Mar 28, 2022, 9:26 AM IST

Updated : Mar 28, 2022, 4:02 PM IST

Stock Market Live Updates
Stock Market Live Updates

16:01 March 28

Stock Market Close: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు నేడు తీవ్ర ఒడుదొడుకుల మధ్య ట్రేడయ్యాయి. తొలుత నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరకు లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 231 పాయింట్లు పెరిగి 57 వేల 593 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో 17 వేల 222 వద్ద సెషన్​ను ముగించింది. ఆటో, బ్యాంకింగ్​, లోహం, రియాల్టీ, ఆయిల్​ అండ్​ గ్యాస్​ రంగాలు రాణించాయి. ఐటీ, ఫార్మా రంగం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత విమానాల రాకపోకలు ప్రారంభమవ్వడం, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆర్​బీఐ ప్రకటన, రష్యా- ఉక్రెయిన్​ మధ్య మళ్లీ చర్చలు జరిగే అవకాశం నేపథ్యంలో మార్కెట్లు సానుకూలంగా ట్రేడయినట్లు నిపుణులు చెబుతున్నారు.

08:56 March 28

Stock Market Live Updates

Stock Market News: స్టాక్​మార్కెట్లు ఈ వారం తొలి సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, దేశంలో చమురు ధరల పెరుగుదల వంటి కారణాలతో సెన్సెక్స్ 149 పాయింట్ల నష్టంతో 57,213 వద్ద ఉంది. నిఫ్టీ కూడా 33 పాయింట్లు కోల్పోయి 17,120 వద్ద ట్రేడ్​ అవుతోంది. సిప్లా, మారుతీ సుజుకీ, బజాజ్​ ఆటో షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్​డీఎఫ్​సీ, కోటక్ మహీంద్ర, డా.రెడ్డీస్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated :Mar 28, 2022, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.