ETV Bharat / business

కుప్పకూలిన దేశీయ సూచీలు.. రూ.3.39లక్షల కోట్ల సంపద ఆవిరి

author img

By

Published : Apr 18, 2022, 9:35 AM IST

Updated : Apr 18, 2022, 12:09 PM IST

stock market news
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

11:56 April 18

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల దిశగా పయనిస్తున్నాయి. డాలర్​ ఇండెక్స్​ 100 ఎగువకు చేరడం వల్ల అంతర్జాతీయంగా నెగెటివ్ సెంటిమెంట్​, ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీన పడుతుందనే భయాలు మదుపర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ- సెన్సెక్స్ 1,173 పాయింట్లు కోల్పోయి​ 57,1656కి దిగొచ్చింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 314 పాయింట్ల నష్టంతో 17,162 వద్ధ కదలాడుతోంది. స్టాక్​ మార్కెట్లు కుప్పకూలడం వల్ల ఉదయం సెషన్​లోనే రూ.3.39లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.

ఎన్టీపీసీ, టాటా స్టీల్, హిందుస్థాన్​ యూనిలివర్, నెస్లీ, మారుతి షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ ఫలితాలు అనుకున్నదానికంటే మరింత ఆందోళనకరంగా ఉండటం వల్ల ఆ సంస్థ షేర్లు 7శాతానికిపైగా కుప్పకూలాయి. టెక్​ మహీంద్ర, హెచ్​డీఎఫ్​​సీ షేర్లు కుడా నాలుగు శాతానికిపైగా నష్టపోయాయి.

09:30 April 18

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు పతనం

Stock market News: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1041 పాయింట్లు కోల్పోయి 57,297కి పడిపోయింది. నిఫ్టీ 245 పాయింట్లు క్షీణించి 17,230 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, రష్యా, ఉక్రెయిన్​ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండటం మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఎన్టీపీసీ, ఓఎన్​జీసీ, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్​, టీసీఎస్​, టెక్ మహీంద్ర, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Last Updated :Apr 18, 2022, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.