ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..

author img

By

Published : Oct 28, 2022, 11:13 AM IST

gold rate today
బంగారం ధర

Gold Rate Today : దేశంలో బంగారం ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate Today : దేశంలో బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.1,150 పెరిగి.. ప్రస్తుతం రూ.52,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.1,125 పెరిగి.. రూ.59,450 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,200గా ఉంది. కిలో వెండి ధర రూ.59,450 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,200వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,450 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,450 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,200 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.59,450 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,662 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.51 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.16,67,994 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.16,67,994
ఇథీరియంరూ.1,24,206
టెథర్​రూ.82.31
బినాన్స్​ కాయిన్​రూ.23,619
యూఎస్​డీ కాయిన్రూ.79

లాభాల్లో స్టాక్​ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 205 పాయింట్లకు పైగా లాభపడి ప్రస్తుతం 59,965 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 53 పాయింట్లు ఎగబాకి 17,792 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్ టాప్‌ 30 సూచీల్లో రిలయన్స్​, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్​జర్వ్, పవర్​గ్రిడ్​, ఇండస్​ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. డాక్టర్ రెడ్డీస్​, భారతీ ఎయిర్​టెల్​, ఇన్ఫోసిస్​, అల్ట్రాసెమ్కో, యాక్సిస్ బ్యాంక్, సన్​ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి: అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం స్వల్పంగా పెరిగింది. ట్రేడింగ్ ప్రారంభంలో 4 పైసాలు లాభపడి.. ప్రస్తుతం 82.29కు చేరింది.

ఇవీ చదవండి: క్రికెట్‌ నేర్పే ఆర్థిక పాఠాలు.. ఇలా చేస్తే భవితకు ధీమా!

ఎలాన్​ మస్క్​ చేతికి 'ట్విట్టర్​'.. పరాగ్ అగర్వాల్, గద్దె విజయపై వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.