ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Apr 15, 2023, 11:14 AM IST

Updated : Apr 15, 2023, 12:54 PM IST

gold rate today
gold rate today

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి.. ప్రస్తుతం రూ.62,280గా ఉంది. కిలో వెండి ధర రూ.1,420 తగ్గి.. ప్రస్తుతం రూ.77,360 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.62,280 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.77,360 రూపాయలుగా ఉంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.62,280 గా ఉంది. కిలో వెండి ధర రూ.77,360 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,280 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.77,360 గా ఉంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.62,280గా ఉంది. కేజీ వెండి ధర రూ.77,360 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 2004.15 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 25.38 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..
బిట్​ కాయిన్​ విలువ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.24,87,052 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్​, క్రిప్టోకరెన్సీలతో.. పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.24,87,052
ఇథీరియంరూ.1,70,904
టెథర్​రూ.81.91
బైనాన్స్​ కాయిన్​రూ.26,932
యూఎస్​డీ కాయిన్రూ.81.84

జీవిత కాల గరిష్ఠానికి బంగారం ధర..
శుక్రవారం.. భారత్​లో బంగారం ధర జీవిత కాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. పది గ్రాముల పసిడి ధర భారీగా పెరిగి.. ప్రస్తుతం రూ.62,780గా ఉంది. కిలో వెండి ధర కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం రూ.78,780 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల దేశీయంగానూ వాటి ధరలకు రెక్కలొచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ పేర్కొన్నారు. డాలర్‌, బాండ్ల సూచీల క్షీణత కారణంగా బంగారం కొనుగోలుకు మదుపరులు మొగ్గు చూపుతున్నారని, దీంతో ధరలు పెరుగుతున్నట్లు సౌమిల్‌ గాంధీ వెల్లడించారు.

Last Updated :Apr 15, 2023, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.