ETV Bharat / business

Gold Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Jun 22, 2023, 11:06 AM IST

gold rate today
బంగారం ధర

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర భారీగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధర రూ.315 తగ్గి.. ప్రస్తుతం రూ.60,400గా ఉంది. కిలో వెండి ధర రూ.1,460 తగ్గి.. ప్రస్తుతం రూ.70,700 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.60,400వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,700 రూపాయలుగా ఉంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.60,400గా ఉంది. కిలో వెండి ధర రూ.70,700 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,400 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,700గా ఉంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.60,400గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,700 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,929 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.54 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..

ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.24,77,630 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్​, క్రిప్టోకరెన్సీలతో.. పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.24,77,630
ఇథీరియంరూ.1,56,996
టెథర్​రూ.81.90
బైనాన్స్​ కాయిన్​రూ.20,796
యూఎస్​డీ కాయిన్రూ.81.94

లాభాలో స్టాక్​ మార్కెట్లు..
Stock Market Updates : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. బాంబే స్టాక్​ ఎక్స్చేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 77 పాయింట్ల నష్టపోయి.. 63,445 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 18,848 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్, టీసీఎస్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, విప్రో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి విలువ..
డాలరులో పోలిస్తే రూపాయి విలువ 8 పైసలు పెరిగి.. 81.93 వద్ద కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.