ETV Bharat / business

మళ్లీ పెరిగిన బంగారం ధర... ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Apr 9, 2022, 1:32 PM IST

GOLD PRICE TODAY
GOLD PRICE TODAY

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.460‬ ప్రియమైంది. కేజీ వెండి రూ.330 మేర పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,800గా ఉంది. కిలో వెండి ధర రూ.68,730 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,800 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,730గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,800గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,730 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,800గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,730 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. ఔన్సు బంగారం 4 డాలర్లు అధికమైంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,934 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.81 డాలర్లుగా ఉంది.

ఇంధన ధరలు ఇలా..: దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పేట్రో బాదుడుకు కాస్త విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. గురువారం నుంచి చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది.
• ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.
• వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది.
• హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

ఇదీ చదవండి: టాటా కొత్త కార్ అదుర్స్.. ధరల పెంపుతో మారుతీ షాక్.. 20వేల వాహనాలు రీకాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.