ETV Bharat / business

పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Apr 7, 2022, 10:30 AM IST

GOLD PRICE TODAY
GOLD PRICE TODAY

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.170 ప్రియమైంది. కేజీ వెండి రూ.160 మేర పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,200గా ఉంది. కిలో వెండి ధర రూ.67,950 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,200 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,950గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,950 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,950 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. ఔన్సు బంగారం 2 డాలర్లు అధికంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,922 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.33 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్లు: స్టాక్ మార్కెట్లు మళ్లీ డీలా పడ్డాయి. సెన్సెక్స్ 348 మేర పడిపోయింది. ప్రస్తుతం 59,261 పాయింట్ల వద్ధ కొనసాగుతోంది. నిఫ్టీ సైతం అమ్మకాల ఒత్తిడికి గురవుతోంది. 88 పాయింట్లు కోల్పోయి.. 17,719 వద్ద ట్రేడవుతోంది. ఫార్మా, ఇంధన రంగాల షేర్లు రాణిస్తున్నాయి. ఆసియా మార్కెట్లు సైతం ఒడుదొడుకుల మధ్యే సాగుతున్నాయి. అమెరికా షేర్లు మంగళవారం నష్టాలు మూటగట్టుకున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
• అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 1.71 శాతం పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 102.80 డాలర్లుగా ఉంది.
• రూపాయి మారకం విలువ 12 పైసలు పడిపోయింది. ప్రస్తుతం డాలరుకు మారకం విలువ రూ.75.96గా ఉంది.

ఇదీ చదవండి: టాటా కొత్త కార్ అదుర్స్.. ధరల పెంపుతో మారుతీ షాక్.. 20వేల వాహనాలు రీకాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.