ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Jun 15, 2022, 10:48 AM IST

Gold Price Today
Gold Price Today

Gold Price Today: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,000గా ఉంది. కిలో వెండి ధర రూ. 61,550గా ఉంది.

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు బుధవారం మళ్లీ తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.300 తగ్గి.. రూ.52,000 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.250 తగ్గి.. రూ.61,550గా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,000గా ఉంది. కిలో వెండి ధర రూ.61,550 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,000గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,550గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,000గా ఉంది. కేజీ వెండి ధర రూ. 61,550వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,550 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర కూడా పెరిగింది. ప్రస్తుతం 1814 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.14 డాలర్లుగా ఉంది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 78.06 వద్ద ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్​కాయిన్​ విలువ తగ్గింది. ప్రస్తుతం రూ. 17,65,238 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.17,65,238
ఇథీరియం రూ.95,061
టెథర్ రూ.83.82
బినాన్స్​ కాయిన్ రూ.17,849
యూఎస్​డీ కాయిన్ రూ.83.89

Stock Market: బుధవారం దేశీయ మార్కెట్​ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 94 పాయింట్లకుపైగా పెరిగి 52 వేల 780 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 15 వేల 780 వద్ద కొనసాగుతోంది. బజాజ్​ ఫైనాన్స్​, టాటాస్టీల్​, మారుతీ, ఐసీఐసీఐ, ఏషియన్​ పెయింట్స్, టైటాన్​ లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ, పవర్​గ్రిడ్, ఇండస్​ఇండ్ నష్టపోయాయి.

ఇవీ చదవండి: 'పసిడి'పై ఇన్వెస్ట్​ చేస్తున్నారా? ఇప్పుడు సురక్షితమా.. కాదా?

ఇల్లు కొనొచ్చా.. ఇంకొన్నాళ్లు ఆగాలా? వడ్డీ రేట్ల సంగతేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.