ETV Bharat / business

'స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా' జంషెడ్​ జె ఇరానీ కన్నుమూత..

author img

By

Published : Nov 1, 2022, 7:58 AM IST

Updated : Nov 1, 2022, 11:00 AM IST

Jamshed J Irani passes away
Jamshed J Irani passes away

Jamshed J Irani passes away : టాటా స్టీల్ మాజీ ఎండీ జంషెడ్ జె ఇరానీ సోమవారం అర్ధరాత్రి మరణించారు. ఆయన 2011లో టాటా స్టీల్ బోర్డు నుంచి పదవీ విరమణ చేశారు.

Jamshed J Irani passes away:టాటా స్టీల్ మాజీ ఎండీ, ప్రముఖ వ్యాపారవేత్త జంషెడ్ జె ఇరానీ(86) సోమవారం అర్ధరాత్రి జంషెద్​పుర్​లో మరణించినట్లు టాటాస్టీల్ తెలిపింది. ఇరానీకి టాటా స్టీల్‌తో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. ఆయన 2011 జూన్​లో టాటా స్టీల్ బోర్డు నుంచి తప్పుకున్నారు. "స్టీల్ మ్యాన్​ ఆఫ్​ ఇండియాగా పేరుగాంచిన పద్మభూషణ్ డాక్టర్​ జంషెడ్ జె ఇరానీ మరణం పట్ల చాలా బాధపడుతున్నాము. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం" అని టాటా స్టీల్​ ట్వీట్ చేసింది.

1936 జూన్ 2న మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జంషెడ్​ ఇరానీ జన్మించారు. 1963లో బ్రిటీష్ ఐరన్ అండ్ స్టీల్​ రీసెర్చ్ అసోషియేషన్​లో సీనియర్ సైంటిఫిక్ అధికారిగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1968లో భారత్​కు తిరిగి వచ్చిన జంషెడ్​.. టాటా స్టీల్​లో చేరారు. అక్కడ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ అధికారికి అసిస్టెంట్​గా పనిచేశారు. 1979లో జనరల్ మేనేజర్​.. 1985లో అధ్యక్షుడి​గా పదోన్నతులు పొందారు. 1992లో టాటా స్టీల్​కు ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవిలో జులై 2001 వరకు కొనసాగారు. జంషెడ్​ జె ఇరానీ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. పద్మభూషణ్​తో ఆయనను సత్కరించింది.

Last Updated :Nov 1, 2022, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.