ETV Bharat / business

రెండో రోజూ లాభాల జోరు- 59,700 పైకి సెన్సెక్స్​

author img

By

Published : Oct 5, 2021, 3:43 PM IST

Stocks updates
స్టాక్ మార్కెట్ అప్​డేట్స్​

స్టాక్ మార్కెట్లు (Stock Market) మంగళవారం కూడా లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex Today) 446 పాయింట్లు పెరిగి 59,700 మార్క్ దాటింది. నిఫ్టీ (Nifty Today) 131 పాయింట్ల లాభంతో 17,800పైకి చేరింది. 30 షేర్ల ఇండెక్స్​లో ఇండస్​ఇండ్ బ్యాంక్ భారీగా లాభ పడింది. సన్​ ఫార్మా అత్యధికంగా నష్టపోయింది.

స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుసగా రెండో రోజూ లాభాల జోరును కొనసాగించాయి. సోమవారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 446 పాయింట్లు బలపడి 59,745 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 131 పాయింట్ల లాభంతో 17,822 వద్దకు చేరింది. ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు.. మిడ్ సెషన్ తర్వాత లాభాలతో దూసుకెళ్లాయి.

బ్యాంకింగ్, టెలికాం, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. ఫార్మా, ఎఫ్​ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 59,778 పాయింట్ల అత్యధిక స్థాయి, 59,127 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 17,833 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,640 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇండస్​ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్​, హెచ్​సీఎల్​టెక్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​, టైటాన్​ షేర్లు లాభాలను గడించాయి.

సన్​ఫార్మా, ఐటీసీ, పవర్​గ్రిడ్​, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. హాంగ్​సెంగ్​ (హాంకాంగ్​) సూచీ లాభాలను గడించింది. నిక్కీ (జపాన్​), కోస్పీ (దక్షిణ కొరియా) సూచీలు భారీగా నష్టపోయాయి. షాంఘై (చైనా) సూచీ సెలవులో ఉంది.

ఇదీ చదవండి: BH-series: భారత్ సిరీస్​లో నంబర్​ కావాలా? ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.