ETV Bharat / business

Stock markets: నష్టాల నుంచి తేరుకున్న సూచీలు- సెన్సెక్స్​ 150 ప్లస్​

author img

By

Published : Nov 8, 2021, 9:32 AM IST

Updated : Nov 8, 2021, 12:42 PM IST

Stock markets
స్టాక్​ మార్కెట్లు

12:35 November 08

నష్టాల నుంచి తేరుకున్న సూచీలు- సెన్సెక్స్​ 150 ప్లస్​

స్టాక్​ మార్కెట్లు నష్టాల నుంచి తేరుకుని లాభాలబాట పట్టాయి. బీఎస్​ఈ సెన్సెక్​ 150 పాయింట్లకుపైగా లాభపడి.. 60 వేల 231 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లకుపైగా వృద్ధి చెంది 17,970 వద్ద కొనసాగుతోంది.

11:37 November 08

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ -సెన్సెక్స్​ 150 పాయింట్లకుపైగా కోల్పోయి.. 59,896 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి.. 17,880 వద్ద కదలాడుతోంది.

  • అల్ట్రాటెక్​ సిమెంట్​, టైటాన్​, బజాజ్​ ఫిన్​సెర్వ్​, బజాజ్​ ఫైనాన్స్​, కొటక్​ బ్యాంకు, టెక్​మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • ఇండస్​ ఎస్​బీఐఎన్​, ఎం అండ్​ ఎం, రిలయన్స్​, ఏసియన్​ పెయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ఎక్కువగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

08:49 November 08

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు

స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్​ను (Stock Market today) లాభాలతో ప్రారంభినప్పటికీ.. కాసేపటికే అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పరిస్థితులతో సూచీలు డీలా పడ్డాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Stock Market Sensex) 100 పాయింట్లకు పైగా కోల్పోయి 59,940 వద్ద కదలాడుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ (Stock Market Nifty) 25 పాయింట్ల నష్టంతో 17,891 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాలోనివి ఇవే..

  • మారుతీ, ఎల్​ అండ్​ టీ, కొటక్​ బ్యాంకు, టైటాన్​, భారతీ ఎయిర్​టెల్​, టెక్​ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • ఇండస్​బ్యాంకు, ఏసియన్​ పెయింట్స్, సన్​ఫార్మా, ఎం అండ్​ ఎం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ఎక్కువగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Last Updated :Nov 8, 2021, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.