స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్ను (Stock Market today) లాభాలతో ప్రారంభినప్పటికీ.. కాసేపటికే అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పరిస్థితులతో సూచీలు డీలా పడ్డాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Stock Market Sensex) 100 పాయింట్లకు పైగా కోల్పోయి 59,940 వద్ద కదలాడుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ (Stock Market Nifty) 25 పాయింట్ల నష్టంతో 17,891 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాలోనివి ఇవే..
- మారుతీ, ఎల్ అండ్ టీ, కొటక్ బ్యాంకు, టైటాన్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
- ఇండస్బ్యాంకు, ఏసియన్ పెయింట్స్, సన్ఫార్మా, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎక్కువగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.