ETV Bharat / business

మార్కెట్ల కొత్త రికార్డు- 16,600 పైకి నిఫ్టీ

author img

By

Published : Aug 17, 2021, 10:09 AM IST

Updated : Aug 17, 2021, 3:48 PM IST

STOCKS LIVE
స్టాక్ మార్కెట్లు

15:44 August 17

మార్కెట్లు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. సెన్సెక్స్ 210 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 55,792 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో సరి కొత్త రికార్డు స్థాయి అయిన 16,615 వద్ద ముగిసింది.

  • టెక్ మహీంద్రా, నెస్లే, హెచ్​యూఎల్​, టైటాన్​, టీసీఎస్​ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • ఇండస్​ఇండ్​ బ్యాంక్, ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్, టాటా స్టీల్​, ఎల్​&టీ ఎక్కువగా నష్టపోయాయి.

09:12 August 17

స్టాక్​ మార్కెట్​ లైవ్ అప్​డేట్స్​

అంతర్జాతీయ ప్రతికూల పవనాల కారణంగా.. స్టాక్​మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలో నష్టాలతో ప్రారంభమై.. కాసేపటికే మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. ప్రస్తుతం ఫ్లాట్​గా కొనసాగుతోంది. 

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 13 పాయింట్లు పెరిగి.. 55,590 ఎగువన ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 16,560 ఎగువన కొనసాగుతోంది. ఫార్మా కంపెనీలు, ఐటీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్ షేర్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. 

  • టెక్ మహీంద్రా, టాటా, సన్​ఫార్మా, సిప్లా, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ, ఇండస్​లాండ్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.
Last Updated :Aug 17, 2021, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.