అంతర్జాతీయ ప్రతికూల పవనాల కారణంగా.. స్టాక్మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలో నష్టాలతో ప్రారంభమై.. కాసేపటికే మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. ప్రస్తుతం ఫ్లాట్గా కొనసాగుతోంది.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 13 పాయింట్లు పెరిగి.. 55,590 ఎగువన ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 16,560 ఎగువన కొనసాగుతోంది. ఫార్మా కంపెనీలు, ఐటీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్ షేర్లు నష్టాలతో కొనసాగుతున్నాయి.
- టెక్ మహీంద్రా, టాటా, సన్ఫార్మా, సిప్లా, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి.
- హెచ్డీఎఫ్సీ, ఇండస్లాండ్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.