ETV Bharat / business

మూడో రోజూ బుల్​ జోరు- సెన్సెక్స్ 385 ప్లస్

author img

By

Published : Dec 23, 2021, 3:44 PM IST

stocks closing
stocks closing

Stock Market Today: వరుసగా మూడోరోజు స్టాక్ మార్కెట్లలో బుల్​ దూకుడు కొనసాగింది. సెన్సెక్స్ 385 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 117 పాయింట్లు వృద్ధి చెందింది.

Share Market Today: దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాలతో ముగిశాయి. గురువారం సెషన్​లో లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో చివర వరకు జోరు కనబరిచాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ-సెన్సెక్స్​ 385 పాయింట్లు వృద్ధి చెంది.. 57,315 వద్ద సెషన్​ను ముగించింది. నిఫ్టీ 117 పాయింట్లు పెరిగి.. 17,072 వద్ద స్థిరపడింది.

దాదాపు అన్నిరంగాల షేర్లు రాణించాయి. ముఖ్యంగా.. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎఫ్​ఎంసీజీ, ఐటీ, ఆయిల్​ అండ్​ గ్యాస్​, పవర్,​ స్థిరాస్తి రంగాల షేర్లు 1-2శాతం మేర లాభాలు గడించాయి.

ఇంట్రాడే సాగిందిలా..

ఉదయం 57,251 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో ​57,490 తాకింది. ఒకదశలో 57,146 అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.

నిఫ్టీ 17,118 పాయింట్ల గరిష్ఠ స్థాయి.. 17,015 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

Stock Market Top Gainers: పవర్​గ్రిడ్​, ఐటీసీ, బజాజ్​ఫైనాన్స్​, ఇన్ఫోసిస్​, ఎన్​టీపీసీ, టైటాన్​, టెక్​మహీంద్రా, బజాజ్​ఫిన్​సెర్వ్ ​షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

Stock Market Top Losers:

భారతీ ఎయిర్​టెల్​, సన్​ఫార్మా, మారుతీ, అల్ట్రాటెక్​ సిమెంట్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఏషియన్​ పెయింట్​, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్​ఇండ్​ బ్యాంకు, టాటాస్టీల్​ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

ఇదీ చూడండి: ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు కార్డుపై నంబర్లన్నీ ప్రతిసారీ ఎంటర్‌ చేయాల్సిందేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.