ETV Bharat / business

కుప్పకూలిన స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్​ 1000 పాయింట్లు పతనం

author img

By

Published : Feb 7, 2022, 9:31 AM IST

Updated : Feb 7, 2022, 3:39 PM IST

STOCK MARKET LIVE UPDATES
STOCK MARKET LIVE UPDATES

15:36 February 07

Stock markets: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, ఆర్​బీఐ ద్రవ్యపరమతి సమీక్షలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోననే అనిశ్ఛితి మదుపర్ల సెంటిమెంట్​ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ 1024 పాయింట్లు కోల్పోయి 57,621కి పడిపోయింది. నిఫ్టీ 302 పాయింట్లు క్షీణించి పాయింట్ల 17,213 వద్ద స్థిరపడింది.

కారణాలు..

ముడిచమురు ధరలు భారీగా పెరగుతుండటం వల్ల ద్రవ్యోల్బణ భయాలు అలముకుంటుండటం, అమెరికా ఫ్యూచర్స్‌ సైతం నష్టాల్లో ఉండటం మదుపర్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. అలాగే ఫిబ్రవరి 8-10 మధ్య సమావేశం కానున్న ఆర్‌బీఐ ద్రవ్య పరపతి కమిటీ నిర్ణయాలపై అనిశ్చితి నెలకొంది. వడ్డీ రేట్ల పెంపు ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చని కొందరు.. స్వల్ప పెంపు ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

ఇంట్రాడే..

సోమవారం ఓపెనింగ్​ సెషన్​ను 58,549 పాయింట్ల వద్ద ప్రారంభించిన సెన్సెక్స్​ 58,707 పాయింట్ల గరిష్ఠాన్ని, 57,299 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. ఉదయం 10 గంటల తర్వాత నుంచి ఏ దశలోనూ కోలుకునే పరిస్థితిలో కన్పించలేదు. నిఫ్టీ కూడా ఇదే ట్రెండ్ కొనసాగించింది. ఓపెనింగ్ సెషన్​ను 17,456 పాయింట్లతో ప్రారంభించి.. 17,536 పాయింట్ల కనిష్ఠాన్ని, 17,119 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.

లాభనష్టాల్లోనివి..

పవర్​గ్రిడ్, ఎన్టీపీసీ, టాటా స్టీల్​, ఎస్​బీఐఎన్​, అల్ట్రాటెక్​ సిమెంట్​ మాత్రమే లాభాలను ఆర్జించాయి. మిగతా అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి

13:51 February 07

బేర్​ పంజా..

అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో ఫ్లాట్​గా ప్రారంభమైన దేశీయ సూచీలు క్రమంగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 1100 పాయింట్లకుపైగా పతనమై 57,460 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 350​ పాయింట్లు కోల్పోయి.. 17,170 వద్ద ట్రేడవుతోంది.

క్యాపిటల్ గూడ్స్​, ఎఫ్​ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులు రాణిస్తున్నాయి.

12:49 February 07

స్టాక్​మార్కెట్లపై బేర్​ విరుచుకుపడుతోంది. ఫలితంగా సూచీలు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. బీఎస్​సీ-సెన్సెక్స్​ 650 పాయింట్లకుపైగా కోల్పోయి.. 58 వేల దిగువన ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ.. 200 పాయింట్లకుపైగా నష్టపోయి 17,314 వద్ద కదలాడుతోంది.

నష్టాలకు కారణాలివే..!

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ముడి చమురు ధరలు మరింత ఎగబాకుతుండడంతో ద్రవ్యోల్బణ భయాలు అలముకుంటున్నాయి. చైనా మినహా ఆసియా సూచీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ సైతం నష్టాల్లో పయనిస్తున్నాయి. ఈ పరిణామాలు మదుపరుల సెంటిమెంట్​ను​ దెబ్బతీశాయి.

మరోవైపు ఫిబ్రవరి 8-10 మధ్య సమావేశం కానున్న ఆర్‌బీఐ పరపతి కమిటీ నిర్ణయాలపై అనిశ్చితి నెలకొంది. రేట్ల పెంపు ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చని కొందరు.. స్వల్ప పెంపు ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ఆటో, స్థిరాస్తి, ఆర్థిక, హెల్త్‌కేర్‌, ఐటీ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలే సూచీలను కిందకు లాగుతున్నాయి.

11:19 February 07

దేశీయ సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 630 పాయింట్లకుపైగా పతనమై.. 58,0135 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 17,317 వద్ద కొనసాగుతోంది.

30షేర్ల ఎస్​బీఐఎన్​, టాటాస్టీల్​, పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, రిలయన్స్​ మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి.

09:04 February 07

స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

Stock market live updates: స్టాక్​ మార్కెట్లు సోమవారం సెషన్​ను ఫ్లాట్​ ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్​ 200 పాయింట్లకుపైగా నష్టపోయి 58,339 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 80 పాయింట్ల పతనంతో 17,436 వద్ద ట్రేడవుతోంది.

30 షేర్ల ఇండెక్స్​లో టాటాస్టీల్​, పవర్​గ్రిడ్, ఎన్​టీపీసీ, అల్ట్రాటెక్​సిమెంట్​, ​ఎస్​బీఐఎన్​, రిలయన్స్​ టెక్​మహీంద్రా మినహా మిగిలిన షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated :Feb 7, 2022, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.