ETV Bharat / business

ఫ్లాట్​గా ముగిసిన స్టాక్​మార్కెట్లు.. సెన్సెక్స్​ 112మైనస్​

author img

By

Published : Nov 9, 2021, 3:39 PM IST

bse sensex today
ఫ్లాట్​గా ముగిసిన స్టాక్​మార్కెట్లు.. సెన్సెక్స్​ 112 మైనస్​

ఒడుదొడుకుల ట్రేడింగ్​లో దేశీయ స్టాక్​మార్కెట్లు ఫ్లాట్​గా ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​(bse sensex today), ఎన్​ఎస్​ఈ నిఫ్టీ(nifty today live) స్వల్ప నష్టాలు నమోదు చేశాయి. ఎఫ్​ఎమ్​సీజీ, లోహ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.

దేశీయ సూచీలు మంగళవారం ఫ్లాట్​గా ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్(bse sensex today live)​ 112 పాయింట్లు కోల్పోయి 60,433 వద్ద ముగిసింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ(nifty today live) 24 పాయింట్లు పతనమై 18,044 వద్ద స్థిరపడింది.

ఎఫ్​ఎమ్​సీజీ, లోహ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఆటోమొబైల్​ రంగం షేర్లు లాభపడ్డాయి.

ఇంట్రాడే సాగిందిలా..

దేశీయ సూచీల ఇంట్రాడే సెషన్​ ఒడిదొడుకుల మధ్య సాగింది.

ఉదయం 60,609 వద్ద ఫ్లాట్​గా ప్రారంభమైన సెన్సెక్స్​.. 60,213 కనిష్ఠాన్ని తాకింది. తిరిగి పుంజుకుని 60,670 గరిష్ఠాన్ని చేరుకుంది. మొత్తం మీద 112 పాయింట్లు నష్టపోయి 60,433 వద్ద ముగిసింది.

18,084 వద్ద ఫ్లాట్​గా ప్రారంభమైన నిఫ్టీ.. 18,112 గరిష్ఠాన్ని తాకింది. అక్కడి నుంచి నష్టాల్లోకి జారుకుంది. 17,983 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసి, చివరికి 24 పాయింట్ల నష్టంతో 18,044 వద్ద స్థిరపడింది.

లాభనష్టాలు..

టాటా మోటర్స్​, ఎం అండ్​ ఎం, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్​ షేర్లు లాభాలు గడించాయి.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, టాటాస్టీల్​, మారుతి, ఎన్​టీపీసీ, హెచ్​డీఎఫ్​సీ, బ్రిటానియా షేర్లు నష్టాపోయాయి.

ఇదీ చూడండి:- ట్విట్టర్​ పోల్​కే 'మస్క్'​ సై- టెస్లా వాటా విక్రయానికి సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.