స్టాక్ మార్కెట్లు (Stock Market) గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బుల్ దూకుడుతో బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 418 పాయింట్లు పెరిగి నూతన గరిష్ఠమైన 59,141 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 110 పాయింట్ల లాభంతో జీవనకాల గరిష్ఠమైన 17,629 వద్దకు చేరింది.
టెలికాం, వాహన రంగాలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించడం సానుకూలతలు (Stock Market) పెంచింది. బ్యాంకింగ్, వాహన, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు దూకుడు ప్రదర్శించాయి. ఫలితంగా సూచీలు ఈ స్థాయి రికార్డులను సాధించాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 59,204 పాయింట్ల అత్యధిక స్థాయి(జీవనకాల గరిష్ఠం), 58,700 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,637 పాయింట్ల గరిష్ఠ స్థాయి(కొత్త రికార్డు), 17,510 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా ఎక్కువగా లాభాలను గడించాయి.
టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్సెంగ్ (హాంకాంగ్) సూచీలు నష్టాలను నమోదు చేశాయి.
ఇదీ చదవండి: 'ఓలా' గ్రాండ్ ఎంట్రీ- సెకనుకు 4 స్కూటర్ల అమ్మకం