ETV Bharat / business

Fuel Price Today: ఆగని పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన చమురు ధరలు

author img

By

Published : Oct 9, 2021, 8:14 AM IST

Updated : Oct 9, 2021, 8:27 AM IST

Fuel Price Today
పెట్రోల్​, డీజిల్​ ధరలు

దేశంలో పెట్రో​ ధరల (Fuel Price Today) బాదుడు ఆగడం లేదు. లీటర్​ పెట్రోల్​పై 30 పైసలు, డీజిల్​పై 35 పైసలు పెంచుతున్నట్లు శనివారం చమురు సంస్థలు తెలిపాయి.

దేశంలో ఇంధన ధరల పెంపు నిత్యకృత్యంగా మారింది. దేశవ్యాప్తంగా శనివారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దిల్లీలో (Fuel Price Today) లీటర్​ పెట్రోల్​ ధర 30 పైసలు పెరగ్గా.. డీజిల్​పై 35 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.103.84కు చేరగా.. డీజిల్​ ధర రూ.92.48కి పెరిగింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.109.8గా ఉంది. డీజిల్ ధర రూ.100.25కు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో...

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 31 పైసలు పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం లీటర్ ధర రూ.107.98కి చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 38 పైసలు పెరిగి.. లీటర్​ రూ.100.86కు చేరింది.
  • విశాఖపట్నంలో (Petrol Price in Vizag) 30 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర.. రూ.108.85కు చేరుకుంది. డీజిల్​పై 37 పైసలు పెరిగి.. రూ.101.2కు చేరింది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 30 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్​ ధర రూ.110.12గా ఉంది. డీజిల్​ లీటర్​కు 37 పైసలు పెరిగి.. రూ.102.43 వద్ద ఉంది.

ఇవీ చూడండి:

Last Updated :Oct 9, 2021, 8:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.