ETV Bharat / business

వీడని కరోనా భయాలు- ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు

author img

By

Published : Mar 11, 2020, 9:43 AM IST

Updated : Mar 11, 2020, 10:26 AM IST

stock markets
స్టాక్ మార్కెట్

దేశీయ సూచీలు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 29 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ ఫ్లాట్​గా కొనసాగుతోంది

అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్న వేళ దేశీయ సూచీలు ఒడుదొడుకుల్లో సాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 25 పాయింట్లు పెరిగి 35,662 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 7 పాయింట్లు మెరుగై 10,444.5 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

అలా పెరిగి.. మళ్లీ మొదటికి..

కరోనా ప్రభావంతో మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఉద్దీపన చర్యలు చేపడుతారన్న అంచనాలతో అగ్రరాజ్య మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి.

ఫలితంగా సెన్సెక్స్​ తొలుత 308 పాయింట్లు లాభపడింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న కారణంగా మళ్లీ సూచీలు కిందికి జారాయి.

లాభనష్టాల్లో..

రిలయన్స్​, హీరో మోటోకార్ప్​, భారతీ ఎయిర్​టెల్​, ఐసీఐసీఐ బ్యాంక్​, బజాజ్​ ఫినాన్స్​, ఎన్టీపీసీ, ఓఎన్​జీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఇన్ఫోసిస్​, ఐటీసీ, టెక్​ మహీంద్ర, హెచ్​సీఎల్​టెక్​, సన్​ఫార్మా, కొటక్​ బ్యాంక్​ నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి విలువ

రూపాయి మారకం విలువ 33 పైసలు బలపడి డాలరుతో పోలిస్తే 73.84 వద్ద కొనసాగుతోంది.

బ్రెంట్ ముడి చమురు ధర 3.41 శాతం పెరిగి బ్యారెల్​కు 38.49 డాలర్లకు చేరుకుంది.

Last Updated :Mar 11, 2020, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.