ETV Bharat / business

బంగారం మరింత ప్రియం.. రూ.53 వేలు దాటిన ధర

author img

By

Published : Mar 2, 2022, 3:57 PM IST

GOLD PRICE TODAY
GOLD PRICE TODAY

GOLD PRICE TODAY: దేశంలో బంగారం ధర భారీగా పెరుగుతోంది. బుధవారం సెషన్​లో రూ.1,202 మేర ధర పెరిగింది. ప్రస్తుతం దిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ.51,889 పలుకుతోంది. హైదరాబాద్​లో పసిడి రేటు రూ.53 వేలు దాటింది.

GOLD PRICE TODAY: దేశ రాజధానిలో బంగారం ధర భారీగా పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల పసిడి రూ.1,202 మేర ఎగబాకి.. రూ.51,889కి చేరుకుంది. క్రితం సెషన్​లో బంగారం ధర రూ.50,687గా ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో దేశంలో పసిడి ప్రియమైందని విశ్లేషకులు తెలిపారు.

Gold price in Delhi

బంగారంతో పాటు వెండి ధర సైతం భారీగా పెరిగింది. కిలో వెండి రూ.2,148 అధికమై.. రూ.67,956కు చేరుకుంది.

Gold rate in Hyderabad

మరోవైపు, హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ. 53,250 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.69,190గా ఉంది.

స్పాట్ గోల్డ్ ధర..

అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1943 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి 25.18 డాలర్ల వద్ద కదలాడుతోంది.

రూపాయి పతనం..

బుధవారం ప్రారంభ సెషన్​లో రూపాయి విలువ 49 పైసలు పడిపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.75.82గా ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రూపాయి పతనానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఇదీ చదవండి: వార్​ ఎఫెక్ట్​.. మార్కెట్లు ఢమాల్​.. సెన్సెక్స్​ 778 పాయింట్లు డౌన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.