ETV Bharat / business

జాక్​మాకు చైనా షాక్- అలీబాబా జాతీయం?

author img

By

Published : Jan 13, 2021, 11:20 AM IST

Jack ma companies to nationalise
జాక్​ మా కంపెనీలు జాతీయం

తమ దేశ ఆర్థిక వ్యవస్థపై విమర్శలు చేసి ఇరకాటంలో పడ్డ అలీబాబా వ్యవస్థాపకుడు 'జాక్​ మా'కు.. చైనా కమ్యునిస్టు ప్రభుత్వం మరో షాకిచ్చే దిశగా అడుగులేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. జాక్​మాకు చెందిన దిగ్గజ సంస్థలు అలీబాబా, యాంట్​ గ్రూప్​లను జాతీయం చేసేందుకు చైనా ప్రయత్నిస్తోందనేది ఈ వార్తల సారాంశం.

చైనా విధానాలను, ఆ దేశ ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థను విమర్శించిన తర్వాత అలీబాబా వ్యవస్థాపకుడు 'జాక్​మా'కు వరుసగా ఇబ్బుందులు తప్పడం లేదు. ఈ కారణాలతో కొన్ని రోజులుగా ఆయన బహిరంగంగా కనిపించడం లేదు. జాక్​మా విమర్శలపై చైనా కమ్యునిస్టు ప్రభుత్వం గుర్రుమీదున్న నేపథ్యంలో.. ఆయన కనిపించకుండా పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి పరిస్థితులు కొనసాగుతుండగానే.. చైనా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. జాక్​మాకు చెందిన అలీబాబా, యాంట్ గ్రూప్​లను జాతీయం చేయాలని చైనా ప్రభుత్వం భావిస్తోందనేది ఈ వార్తల సారాంశం. '60 బిలియన్​ డాలర్ల సంపద కలిగిన జాక్​మాను 'పేదలను దోపిడీ చేసి సంపాదించే రక్త పిశాచి'గా చైనా ప్రభుత్వ సంస్థలు విమర్శిస్తున్నట్లు ఓ నివేదిక సంచలన విషయాలు బయటపెట్టింది.

గత ఏడాది జాక్​మా చేసిన విమర్శలను తీవ్రంగా పరిగణించిన చైనా ఆయన కంపెనీల అణచివేతకు నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఇందులో భాగంగానే చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ స్వయంగా.. జాక్​మాకు చెందిన 37 బిలియన్ డాలర్ల 'యాంట్​ గ్రూప్' ఐపీఓను అడ్డుకున్నారని వాల్​ స్ట్రీట్​ జర్నల్ గత ఏడాది నవంబర్​లో ఓ కథనం ప్రచురించింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.