ETV Bharat / business

దీపావళికి స్మార్ట్​ఫోన్ కొనాలా..? ఇవైతే చౌక...!

author img

By

Published : Oct 20, 2019, 4:20 PM IST

దీపావళికి స్మార్ట్​ఫోన్ కొనాలా..? ఇవైతే చౌక...!

ఈ దీపావళికి స్మార్ట్​ఫోన్ కొనాలనుకునే వారికి అమెజాన్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ బ్రాండ్ల ఫోన్లపై ప్రత్యేక తగ్గింపుతో పాటు.. 10 శాతం వరకు డిస్కౌంట్​ ఇస్తోంది. ఈ నెల 21 నుంచి 25 వరకు నిర్వహిస్తోన్న దీపావళి ప్రత్యేక సేల్​లో ఈ ఆఫర్లు పొందొచ్చని పేర్కొంది. మరి ఏ మొబైల్​పై ఎంత ధర తగ్గనుందో పూర్తి వివరాలు మీ కోసం.

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మరోసారి గ్రేట్ ఇండియా ఫెస్టివల్​ సేల్​తో ముందుకొచ్చింది. అక్టోబర్ 21 నుంచి 25 వరకు ఆఫర్​ అందుబాటులో ఉండనుంది.
దీపావళి సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక సేల్​లో స్మార్ట్​ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, క్యాష్​బ్యాక్​లను ఇవ్వనుంది అమెజాన్. ఈ ప్రత్యేక ఆఫర్​ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

10 శాతం డిస్కౌంట్ పొందండిలా..

గ్రేట్ ఇండియా ఫెస్టివల్ తాజా ఎడిషన్​లో అమెజాన్ ఇండియా.. యాక్సిస్ బ్యాంకు, సిటీ బ్యాంకుల భాగస్వామ్యంతో 10 శాతం డిస్కౌంట్​ ఇస్తోంది. ఆయా సంస్థలకు చెందిన క్రెడిట్, డెబిట్​ కార్డులతో కొనుగోళ్లు జరపడం ద్వారా ఈ ఆఫర్లు పొందొచ్చు. రూపే కార్డులతో జరిపే లావాదేవీలకూ ఈ ఆఫర్​ వర్తించనుంది.

ప్రత్యేక ఆఫర్లున్న స్మార్ట్​ఫోన్లు ఇవే..

షియోమీ ఇటీవల విడుదల చేసిన రెడ్​ మీ నోట్ 8 ప్రో, రెడ్​ మీ నోట్ 8 ఫోన్లు అమెజాన్ ఇండియాలో సోమవారం నుంచే కొనుగోళ్లకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కొనే వారికి 1120 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, ఎయిర్​టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలను ఎయిర్​టెల్ ఇవ్వనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్, గెలాక్సీ ఏ10ఎస్, వీవో యూ10 మొబైళ్లపై రూ.1,000 వరకు తగ్గింపు ఇవ్వనుంది అమెజాన్.

ఇటీవల విడుదలైన నోకియా 6.2పైనా దీపావళి ప్రత్యేక ఆఫర్​లో తాత్కాలికంగా ధర తగ్గింపు ఉండనుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం రూ.15,999గా ఉన్న ఈ స్మార్ట్​ఫోన్ రూ.14,499కి లభించనున్నట్లు తెలుస్తోంది.

వన్​ప్లస్​ 7 స్మార్ట్​ఫోన్​ ధరను రూ.29,999కి తగ్గించగా.. రెడ్​ మీ 7ఏ రూ.4,999కే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.

ఈ ప్రత్యేక పండుగ సీజన్​లో భాగంగా ప్రీమియం స్మార్ట్​ఫోన్లయిన వన్​ప్లస్ 7 ప్రో ధరను రూ.43,999కి, ఐఫోన్​ ఎక్స్ఆర్ ధరను రూ.44,999కి తగ్గించి విక్రయించనున్నట్లు అమెజాన్ పేర్కొంది. మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్ అయిన పోకో ఎఫ్​1 రూ.14,999కే లభ్యం కానుంది.

మొబైల్ ఫోన్ ఉపకరణాలు రూ.49నుంచి ప్రారంభం కానుండగా.. పవర్​ బ్యాంకులు, హెడ్​సెట్ వంటివి రూ.399 నుంచి లభ్యం కానున్నాయి. వీటికోసం తమ వైబ్​సైట్​లో ప్రత్యేక పేజీని కేటాయించనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. వీటితో పాటు ల్యాప్​టాప్​లు, కెమెరాలపైనా భారీ తగ్గింపు ఇవ్వనున్నట్లు అమెజాన్ పేర్కొంది.

గృహోపకరణాలపై భారీ ఆఫర్లు..

\దీపావళి సందర్భంగా నిర్వహిస్తోన్న ప్రత్యేక సేల్​లో గృహోపకరణాలు, టీవీల వంటి ఎలక్ట్రానిక్​ సాధనాలపై 60 శాతం వరకు తగ్గింపు ఇవ్వనుంది అమెజాన్. వంట సామగ్రి వంటి వస్తువలపై 70 శాతం వరకు ఈ ఆఫర్ వర్తించనుంది. నోకాస్ట్ ఈఎంఐ, డెబిట్​, క్రెడిట్​ కార్డులపై ఈఎంఐ వంటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.

ఇదీ చూడండి: 'ఆ యాడ్​లు అలా ఉంటే ఊరుకునేది లేదు'

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Sunday, 20 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1510: UK Patrick Stewart Brexit March AP Clients Only 4235677
Patrick Stewart gives speech at anti-Brexit rally
AP-APTN-1121: China Jay Chou Content has significant restrictions, see script for details 4235652
Jay Chou's 20th anniversary Carnival world tour kicks off in Shanghai
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.