ETV Bharat / business

బ్యాంకింగ్ షేర్ల జోరుతో సెన్సెక్స్ 111 ప్లస్​

author img

By

Published : May 24, 2021, 9:24 AM IST

Updated : May 24, 2021, 3:44 PM IST

stock markets live updates
సాక్​ మార్కెట్ లైవ్ అప్డేట్స్​

15:42 May 24

15:41 May 24

స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 111 పాయింట్లు పెరిగి 50,652 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 15,198 వద్దకు చేరింది. బ్యాంకింగ్ షేర్ల సానుకూలతలు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

  • ఎస్​బీఐ, ఎల్​&టీ, ఐటీసీ, డాక్టర్​ రెడ్డీస్​, యాక్సిస్​ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాలను గడించాయి.
  • ఇండస్​ ఇండ్​ బ్యాంక్, అల్ట్రాటెక్​ సిమెంట్​, టైటాన్​, బజాజ్ ఫిన్​సర్వ్, హెచ్​యూఎల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

ఇదీ చదవండి:పసిడి బాండ్ల ఇష్యూ షురూ- గ్రాముకు ఎంత?

08:58 May 24

లైవ్: స్టాక్ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు ఈ వారం తొలి సెషన్​లో లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్సేంజ్​ బీఎస్​ఈ 004 పాయింట్లు మెరుగుపడి 50,744కి చేరింది.  జాతీయ స్టాక్ ఎక్సేంజ్​ నిఫ్టీ 39 పాయింట్లు వృద్ధి చెంది 15,214 వద్ద ట్రేడ్​ అవుతోంది.

కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం, అంతర్జాతీయ పరిణామాలు  మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిర రంగ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సిమెంట్​, ఉక్కు రంగ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

Last Updated :May 24, 2021, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.