ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లపై యుద్ధ ప్రభావం- సెన్సెక్స్​ 1800 పాయింట్లు పతనం

author img

By

Published : Feb 24, 2022, 9:49 AM IST

Updated : Feb 24, 2022, 10:05 AM IST

stock market live updates
stock market live updates

Stock markets: ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లు గురువారం కుప్పకులాయి. సెన్సెక్స్​ దాదాపు 1900 పాయింట్లు నష్టపోగా... నిఫ్టీ 500 పాయింట్లకుపైగా పతనమైంది.

stock market news: స్టాక్​ మార్కెట్లు గురువారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1881 పాయింట్లు కోల్పోయి 55,350కి పతనమైంది. నిఫ్టీ 552 పాయింట్లు కుప్పకూలి 16,510కి పడిపోయింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులకు తోడు ఉక్రెయిన్​పై రష్యా యుద్ధాన్ని ప్రకటించడం మదుపర్లపై తీవ్రచూపింది.

దేశీయ మార్కెట్లలో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్ షేర్లు అత్యధికంగా 5.91శాతం నష్టపోగా.. భారతీ ఎయిర్​టెల్, టెక్​ మహీంద్ర, ఇండస్ఇండ్​, అదానీ పోర్ట్స్​ షేర్లు నాలుగు శాతానికిపై కుప్పకూలాయి.

ఇదీ చదవండి: రిలయన్స్​ స్థాయిలో మరో 30 కంపెనీలు: అంబానీ

Last Updated :Feb 24, 2022, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.