ETV Bharat / business

వరుసగా ఆరో రోజు లాభాలు- 14వేలకు చేరువైన నిఫ్టీ

author img

By

Published : Dec 30, 2020, 3:40 PM IST

Indices trade in the green amid volatility
వరుసగా ఆరో రోజు లాభాలు- 14వేలకు చేరువైన నిఫ్టీ

స్టాక్​ మార్కెట్ సూచీలు వరుసగా ఆరో రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 133​ పాయింట్లు వృద్ధి చెంది 47,746 వద్ద ముగిసింది. నిఫ్టీ 49 పాయింట్లు మెరుగుపడి 13,981 వద్ద స్థిరపడింది. ఉదయం మందకొండిగా సాగిన సూచీలు అంతర్జాతీయంగా సానుకూల పవనాలతో చివర్లో లాభాల బాట పట్టాయి.

అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు, బ్రిటన్​లో ఆక్స్​ఫర్డ్ టీకాకు అనుమతుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్సేంజీ- సెన్సెక్స్​ 133 పాయింట్లు వృద్ధి చెంది 47,746 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్సేంజీ నిప్టీ 49 పాయింట్ల పెరిగి 13,981 వద్ద స్థిరపడింది.

ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఇంట్రా డేలో మందకొండిగా సాగాయి. చివరకు మళ్లీ పుంజుకుని లాభాల బాట పట్టాయి.

అల్ట్రాటెక్​ సిమెంట్​, శ్రీ సిమెంట్స్, యూపీఎల్​, బబాజ్​ ఫైనాన్స్​ షేర్లు వృద్ధి సాధించాయి.

ఇండస్​ఇండ్ బ్యాంక్​, సన్​ఫార్మా, యాక్సిస్​ బ్యాంక్​, టీసీఎస్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు నష్టాలు చవిచూశాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.