ETV Bharat / business

వంట నూనెల ధరల్లో ఈ మార్పు గమనించారా?

author img

By

Published : Jun 17, 2021, 11:00 AM IST

Updated : Jun 17, 2021, 11:41 AM IST

oil prices
వంటనూనెల ధరల్లో క్రమంగా తగ్గుదల

గడచిన నెల రోజులుగా వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. దాదాపు 20 శాతం క్షీణించినట్లు వెల్లడించింది. వంటనూనెల ధరల తగ్గింపు కోసం శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.

దేశంలో వంటనూనెల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. దిగుమతులను గణనీయంగా పెంచినట్లు పేర్కొన్న ప్రభుత్వం.. ఈ అంశంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.

క్రమంగా తగ్గుదల..

మే 7న పామాయిల్ ధర కిలోకు రూ.142 ఉండగా ప్రస్తుతం రూ.115కి పడిపోయిందని ప్రభుత్వం తెలిపింది. అదే విధంగా ముంబయిలో మే 20న సోయా నూనె ధర కిలోకు రూ.162 ఉండగా.. ఇప్పుడు రూ.138కి లభిస్తున్నట్లు వివరించింది.

హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి వంట నూనెలకు డిమాండ్ తగ్గినందున.. 2019-20లో దిగుమతులు 13 శాతం తగ్గి 135.25 లక్షల టన్నులకు పరిమితమయ్యాయి.

శాశ్వత పరిష్కారం..

అంతర్జాతీయంగా ధరల హెచ్చుతగ్గులు సహా.. దేశీయ ఉత్పత్తిపై ఆధారపడి వంటనూనెల ధరలు ప్రభావితం అవుతాయని వినియోగదారుల వ్యవహారాల శాఖ వివరించింది. దేశీయ వినియోగం, ఉత్పత్తి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మధ్య, దీర్ఘకాలిక చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇవీ చదవండి: 30,00,000 బీపీఓ ఉద్యోగాల గల్లంతు!

టీవీల ధరలు 3-4% పెంపు!

Last Updated :Jun 17, 2021, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.