ETV Bharat / business

ఫ్లిప్​కార్ట్ ఫ్లాగ్​షిప్ ఫెస్ట్​: ఐఫోన్లపై అదిరే ఆఫర్లు!

author img

By

Published : May 11, 2021, 12:06 PM IST

Flipkart Flagship sale
ఫ్లిప్​కార్ట్ ఫ్లాగ్​షిప్​ సేల్

ఐఫోన్లు ఇతర ఫ్లాగ్​షిప్​ మొబైల్​లపై ఫ్లిప్​కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. ఫ్లాగ్​షిప్​ ఫెస్ట్ పేరుతో ఈ సేల్​ నిర్వహిస్తోంది. ఇతర హై ఎండ్​ ఫోన్లనూ ఈ సేల్​లో​ భారీ తగ్గింపు ధరకు విక్రయిస్తోంది ఫ్లిప్​కార్ట్.

బిగ్​ సేవింగ్​ డేస్​ సేల్ ముగిసిన వెంటనే మరో ఆఫర్​తో ముందుకొచ్చింది ఈ కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​. 'ఫ్లాగ్​ షిప్​ ఫెస్ట్'​ పేరుతో ఈ కొత్త ఆఫర్​ను తీసుకొచ్చింది. హై ఎండ్ స్మార్ట్​ ఫోన్లకు సంబంధించిన ఈ ఆఫర్​ సోమవారం (మే 10) ప్రారంభమైంది. ఈ నెల 14 వరకు అందుబాటులో ఉండనుంది.

ఆఫర్లు ఇలా..

ఐఫోన్​ 11, ఐఫోన్ 12, శాంసంగ్​ ఎఫ్​62 సహా ఫ్లాగ్​షిప్​ సెగ్మెంట్​లో భారీ డిమాండ్​ ఉన్న దాదాపు అన్ని మోడళ్లపై డిస్కౌంట్​ ఆఫర్​ను ప్రకటించింది ఫ్లిప్​కార్ట్​. రూ.2,500 నెలవారీ ఈఎంఐతో ఫ్లాగ్​ షిప్​ ఫోన్లను సొంతం చేసుకునే ఆఫర్​ కూడా ఈ సేల్​లో ఉంది.

తగ్గింపు ఇలా..

  • ఐ ఫోన్ 11.. 64 జీబీ స్టోరేజ్ వేరియంట్​ ప్రస్తుత ధర రూ.54,900గా ఉండగా.. ఫ్లాగ్​షిప్​ సేల్​లో దీని ధరను రూ.48,999కి తగ్గించింది ఫ్లిప్​కార్ట్. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్​ ధరను రూ.55,999గా నిర్ణయించింది.
  • ఐఫోన్​ 12, 12 ప్రో లాంటి మోడళ్లపైనా ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్​ ఎక్స్​ ఆర్​ ధరను రూ.36,999గా నిర్ణయించింది.
  • రియల్​మీ ఎక్స్ 50 ప్రో 5జీ మొబైల్ ధరను రూ.41,999 నుంచి ఏకంగా రూ.24,999కి తగ్గించింది ఫ్లిప్​కార్ట్​.
  • ఎల్​జీ వింగ్​ 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధరను రూ.29,999గా నిర్ణయించింది.
  • వీటన్నింటితో పాటు సిటీ బ్యాంక్ డెబిట్​, క్రెడిట్​ కార్డ్ ద్వారా చెల్లింపులు చేస్తే.. 10 శాతం అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. రూ.20 వేలకు మించి కొనుగోళ్లు జరిపిన వారికి అదనంగా మరో రూ.500 క్యాష్​ బ్యాంక్ లభించనుంది.

ఇదీ చదవండి:ఆగని పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.