ETV Bharat / business

కరోనాపై పోరులో భారత్​కు ఏడీబీ ఆర్థిక సాయం

author img

By

Published : Apr 27, 2021, 8:26 PM IST

ADB, ఏషియా డెవెలప్​మెంట్​ బ్యాంక్​
కరోనా పోరులో భారత్​కు ఏడీబీ ఆర్థిక సాయం

కొవిడ్​ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి 1.5 బిలియన్​ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది ఏషియా డెవలప్​మెంట్​ బ్యాంకు.

కరోనా మహమ్మారిపై పోరులో భారత్​కు అండగా నిలిచింది ఏషియా డెవలప్​మెంట్ బ్యాంక్ (ఏడీబీ). వైరస్​ను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి 1.5 బిలియన్​ డాలర్లను కేటాయించినట్లు తెలిపింది.

మహమ్మారిపై పోరాడటానికి 26 దేశాలకు ఆర్థిక సహాయం అందించడానికి ఏడీబీ గతేడాది ఏప్రిల్‌లో 20 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకు 26 దేశాలకు వివిధ రూపాల్లో 16.1 బిలియన్​ డాలర్ల మేర ఖర్చు చేసినట్లు తెలిపింది. ఇందులో భాగంగానే భారత్​కు ఈ ఏడాది చివరి నాటికి.. కేటాయించిన మొత్తంను అందిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.

ఇదీ చూడండి: సభ్య దేశాలకు ఏడీబీ మరింత సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.