ETV Bharat / bharat

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

author img

By

Published : May 24, 2022, 10:09 AM IST

బాయ్​ఫ్రెండ్​ సాయంతో భర్త దారుణ హత్య
బాయ్​ఫ్రెండ్​ సాయంతో భర్త దారుణ హత్య

Wife killed husband: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ ఆమె ప్రియుడి సాయంతో భర్తనే హతమార్చింది. మహారాష్ట్రలోని ముంబయిలో ఈ ఘటన జరిగింది. మరోవైపు కేరళలోని కొట్టాయంలో ఓ ఏడాది వయసు ఉన్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటి బకెట్​లో పడి ప్రాణాలు కోల్పోయింది.

Wife killed husband: వివాహేతర సంబంధం ఉన్న ఓ మహిళ తన ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది. శనివారం.. మహారాష్ట్ర, ముంబయిలోని గోవాండీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది.. హత్యకు గురైన ఇర్ఫాన్​ ఖాన్​కు (34) కొన్నాళ్ల క్రితం నాజరియా అనే మహిళతో వివాహమైంది. అయితే గత కొంతకాలం క్రితం నాజరియాకు సదర్​ ఆలం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన నిందితురాలు.. ప్రియుడితో కలిసి హత్యకు పథకం వేసింది. ఈ క్రమంలో శనివారం రాత్రి సుమారు 11 గంటలకు సదర్​తో కలిసి భర్తను హత్య చేసింది. ఇర్ఫాన్​ సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్​ చేశారు.

అయ్యో పాపం..: కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూర్​ ప్రాంతంలో విషాద ఘటన జరిగింది. బాత్రూంలోకి వెళ్లిన భాగ్య అనే ఏడాది చిన్నారి ప్రమాదవశాత్తు అక్కడి నీళ్ల బకెట్​లోకి తలకిందులుగా పడిపోయింది. ఆ సమయంలో చిన్నారిని తల్లిదండ్రులు గమనించకపోవడం వల్ల కాసేపటికి ఆమె ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయింది. కొద్దిసేపటికి చిన్నారి కోసం ఇంట్లో వెతకగా.. స్నానాల గదిలో భాగ్య విగతజీవిగా పడి కనిపించింది. భాగ్య.. జయేశ్​-శరణ్య దంపతుల ఒక్కగానొక్క కూతురని.. అల్లారముద్దుగా పెరుగుతూ వచ్చిన ఆమె ఇలా విగతజీవిగా పడి ఉండటం జీర్ణించుకోలేకపోతున్నామని కుటుంబీకులు కన్నీరుమున్నీరు అయ్యారు. సోమవారం సాయంత్రం సుమారు 4 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లండిచారు.

ఇదీ చూడండి : ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు- లారీ ఢీకొని తొమ్మిది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.