ETV Bharat / bharat

తమిళనాడులో ఆ ప్రాంతాలు జలదిగ్బంధం- విద్యాసంస్థలు బంద్​

author img

By

Published : Nov 29, 2021, 11:36 AM IST

Updated : Nov 29, 2021, 1:30 PM IST

Tamil Nadu News
తమిళనాడులో ఆగని వర్షపాతం-వరద నీటిలోనే ప్రజలు

తమిళనాడులో వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. చెన్నై, తిరుచ్చి సహా పలు ప్రాంతాలు (Tamil Nadu News) నీట మునిగాయి. 11 జిల్లాల్లోని స్కూల్స్​, కాలేజీలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది.

తమిళనాడులో భారీ వర్షాలు

Tamil Nadu News: ఈనెల 26 నుంచి ఏడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడును ముంచెత్తాయి. చెన్నైలోని అంబత్తూర్​, వీఓసీ నగర్ సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. వరదల కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది.

Tamil Nadu News
బోటు సాయంతో వరద నీటిలో ప్రయాణిస్తున్న గ్రామస్థులు
Tamil Nadu News
భారీ వర్షాలకు జలమయమైన రోడ్లు

మరోవైపు తిరుచ్చిలో కూడా వరద ప్రభావం తీవ్రంగా ఉంది. సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు వరదల్లో చిక్కుకున్న పలువురిని బోటు సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల నేపథ్యంలో 11 జిల్లాల్లోని స్కూల్స్​, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.

Tamil Nadu News
సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు
Tamil Nadu News
ఇంట్లోకి చేరిన వరద నీరు

భూకంపం..

వెల్లూరు జిల్లా తట్టప్పరాయ్​ గ్రామంలో సోమవారం స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్​ స్కేల్​పై 3.6గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఓ ఇల్లు స్వల్పంగా ధ్వంసమైంది.

ఇదీ చూడండి : భర్త కొట్టడం తప్పేమీ కాదంట- మెజార్టీ తెలుగు మహిళల మాట!

Last Updated :Nov 29, 2021, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.