ETV Bharat / bharat

26దేశాలు చుట్టేసిన టీస్టాల్​ ఓనర్​ విజయన్​ కన్నుమూత

author img

By

Published : Nov 19, 2021, 8:43 PM IST

kr vijayan and mohana
ప్రముఖ టీ స్టాల్​ ఓనర్-​ పర్యటకుడు కేఆర్​ విజయన్ మృతి

విదేశీ పర్యటనలతో గుర్తింపు సంపాదించుకున్న టీ స్టాల్​ ఓనర్​ కేఆర్​ విజయన్​ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. విజయన్​-మోహన దంపతులు.. 14 ఏళ్లలో 26 దేశాలు చుట్టేశారు.

విదేశీ పర్యటనలతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ టీ స్టాల్​ యజమాని (KR Vijayan and Mohana) కేఆర్​ విజయన్ (71)​ శుక్రవారం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా విజయన్​ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. విజయన్​ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు(kr vijayan and mohana tea shop).

kr vijayan and mohana
విదేశీ పర్యటనలో కేఆర్​ విజయన్-మోహన దంపతులు

'వారానికి కనీసం రెండ్లుసార్లైనా నాకు వడ, పూరి, చాయ్​ను అందిస్తూ.. తన పర్యటనల గురించి వివరించే వ్యక్తి చనిపోయినందుకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను' అని ప్రముఖ రచయిత ఎన్​ఎస్​ మాధవన్​ ట్వీట్​ చేశారు.

kr vijayan and mohana
కేఆర్​ విజయన్​-మోహన దంపతులు

విజయన్​, ఆయన భార్య మోహన.. 'శ్రీ బాలాజీ కాఫీ హౌస్​' పేరుతో కేరళ కొచ్చిలో స్టాల్​ను (KR Vijayan and Mohana) నడుపుతున్నారు. విదేశీ పర్యటనలు చేయాలన్న ఆసక్తితో వచ్చిన ఆదాయంలో ప్రరి రోజు రూ.300 ఆదా చేసి, మరికొంత అప్పు తీసుకుని పలు దేశాలు సందర్శించారు. ఈ దంపతులు తొలిసారిగా 2007లో ఇజ్రాయెల్​ వెళ్లారు. సోషల్​ మీడియాలో వీరి గురించి వైరలయ్యాక అనేక మంది వీరికి ఫండింగ్ ఇచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్​ మహీంద్రా కూడా 2019లో విజయన్ దంపతుల ఆస్ట్రేలియా ట్రిప్​కు స్పాన్సర్​ చేశారు.

గడిచిన 14 ఏళ్లలో 26 దేశాలు తిరిగారు ఈ దంపతులు. 2019 తర్వాత కొవిడ్​ కారణంగా పర్యటనకు విరామం ఇచ్చిన దంపతులు ఈ ఏడాది అక్టోబరు 21-28 మధ్య రష్యాను సందర్శించారు. ఇదే విజయన్​కు చివరి విదేశీ పర్యటన అయింది.

ఇదీ చూడండి : పెళ్లైన మూడో రోజుకే యువతి ఆత్మహత్య- అమ్మానాన్న అలా చేశారని...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.