ETV Bharat / bharat

Uttar Pradesh Road Accident : చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణం

author img

By PTI

Published : Oct 31, 2023, 7:16 AM IST

Updated : Oct 31, 2023, 7:56 AM IST

UP Road Accident News
ఉత్తర్​ప్రదేశ్​ కారు ప్రమాదం

Uttar Pradesh Road Accident : ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. హర్డోయ్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మరోవైపు.. పోలీసులు వెళ్తున్న వాహనం బోల్తా పడి 38 మంది గాయపడ్డారు. గుజరాత్​లో జరిగిందీ ప్రమాదం.

Uttar Pradesh Road Accident : ఓ కారు చెట్టును ఢీకొట్టడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఉత్తర్​ప్రదేశ్​లోని హర్డోయ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. ఖమరియా గ్రామంలో బిల్హౌర్-కత్రా హైవేపై ప్రమాదం జరిగింది. కారులో నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు గ్యాస్​ కట్టర్లు వినియోగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

  • #WATCH | Hardoi, UP: Five people of the same family died when their vehicle lost control on the Bilhaur-Katra highway and hit a tree.

    Durgesh Kumar Singh (SP, Hardoi) says, "A total of four persons and a four-year-old child were going from Barakanth village to Nayagaon in a… pic.twitter.com/fBfUG0FkGV

    — ANI (@ANI) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురు ఉన్నారు. బాధితులు బరాకాంత్ గ్రామానికి చెందిన వారు. వీరంతా బరాకాంత్​ నుంచి నయాగావ్ వెళ్తున్నారు. మార్గ మధ్యలో కారు ప్రమాదానికి గురైంది.
ఘటనపై స్థానికుల నుంచి సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకుని.. బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.

బోల్తా పడ్డ పోలీసుల బస్సు.. 38 మంది..
పోలీసులు వెళ్తున్న బస్సు​ బోల్తా పడి 38 మంది గాయపడ్డారు. గుజరాత్​లోని పంచమహల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వాహనం బ్రేక్​లు​ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణం. స్టేట్​ రిజర్వ్ పోలీసులు.. ఫైరింగ్ ప్రాక్టీస్​ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. వారందరి వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పోలీసుల పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

  • #WATCH | Panchmahal, Gujarat: 38 personnel of the State Reserve Police (SRP) were injured when a bus carrying them overturned due to brake failure.

    Police officer, ML Gohil said, "...The jawans were returning after completing their firing practice when the bus overturned due to… pic.twitter.com/7aCGWVJaun

    — ANI (@ANI) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి.. ఫంక్షన్​ నుంచి వస్తుండగా..
Rajasthan Accident News : రెండు రోజుల క్రితం కూడా రాజస్థాన్​లోని హనుమాన్​గఢ్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు.. ఓవర్​టేక్​ చేయబోయి లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఏడుగురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఘటనలో మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఓ ఫంక్షన్​కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పూర్తి కథనం కోస ఇక్కడ క్లిక్ చేయండి.

Buses Fire At Bangalore : గ్యారేజీలో అగ్నిప్రమాదం.. 22 బస్సులు దగ్ధం.. కారణం అదే!

Death of Former BJP MPs Son : వైద్యుల నిర్లక్ష్యంతో బీజేపీ మాజీ ఎంపీ కొడుకు మృతి!.. ICU బెడ్లు లేక గంటపాటు అవస్థ

Last Updated :Oct 31, 2023, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.