మహారాష్ట్రలో 50 అడుగుల లోతైన బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారిని గ్రామస్థులు సురక్షితంగా బయటకు తీశారు. నాగ్పూర్లోని రామ్టెక్ తాలూకా శివాని భోండ్కి గ్రామంలో జరిగిందీ ఘటన. నవ్గన్ దేవా అనే బాలుడి తండ్రి సమీప పొలాల్లో పశువులు కాస్తుండగా.. తోటి చిన్నారులతో కలసి ఆడుకుంటున్న సమయంలో దేవా బోర్వెల్లో పడిపోయాడు. దీనితో చిన్నారి తల్లిదండ్రులు సహాయం కోసం అరవగా అక్కడికి చేరుకున్న గ్రామస్థులు ఆ బాలుడిని తాడు సహాయంతో రక్షించారు.
ఇదీ చదవండి: తల్లి ప్రోత్సాహం.. చిన్నారి సాహసం!
ఇదీ చదవండి: బెంచ్లో ఇరుక్కుపోయిన చిన్నారి.. చివరికి!
బావి లోపలికి ఒక పొడవైన తాడును విడిచిన గ్రామస్థులు.. దానిని గట్టిగా పట్టుకోవాలని చిన్నారికి సూచించారు. బాలుడు సైతం తాము చెప్పినట్లు చేయడం వల్ల తమ పని సులువైందని కృష్ణ అనే గ్రామస్థుడు తెలిపాడు. సుమారు 45 నిమిషాల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది.
అధికారులకు సమాచారం అందించినప్పటికీ.. వారి రాక కోసం వేచిచూడకుండా గ్రామస్థులు చూపిన సమయస్ఫూర్తికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.
ఇవీ చదవండి: అయ్యో పాపం.. తాగునీరు లేక చిన్నారి మృతి