ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ఉగ్రవాదులు హతం

author img

By

Published : Jul 14, 2021, 7:59 AM IST

Updated : Jul 14, 2021, 8:38 AM IST

Encounter
ఎదురుకాల్పులు

07:57 July 14

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య పరస్పర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు సహా పాకిస్థాన్​కు చెందిన లష్కరే తొయిబా కమాండర్ ఐజాజ్ అలియాస్ అబూ హురైరా హతమైనట్లు అధికారులు వెల్లడించారు.  

భద్రత బలగాలు నిర్భంద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రత దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఎన్​కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Last Updated :Jul 14, 2021, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.