ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ముగ్గురు ముష్కరులు హతం

author img

By

Published : Jul 10, 2021, 4:08 PM IST

Updated : Jul 10, 2021, 6:45 PM IST

Two unidentified terrorists neutralised
కశ్మీర్​లో ఎన్​కౌంటర్

16:04 July 10

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ముగ్గురు ముష్కరులు హతం

కశ్మీర్​లోని అనంత్​ నాగ్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో ముగ్గురు ముష్కరులు హతం అయినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. 

ఉగ్రమూకలు ఉన్నట్లు సమాచారం రావటం వల్ల దక్షిణ కశ్మీర్​లోని క్వారిగామ్, రాణిపొరా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ముష్కరులు తమపై కాల్పులు జరపగా.. దీటుగా బదులిచ్చామన్నారు. 

మృతిచెందిన ఉగ్రవాదులు లష్కర్​ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా గుర్తించారు. 

ఇదీ చదవండి : రూ.2,500 కోట్లు విలువ చేసే హెరాయిన్ సీజ్​

Last Updated :Jul 10, 2021, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.