ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం

author img

By

Published : Nov 12, 2021, 12:37 AM IST

Updated : Nov 12, 2021, 1:59 AM IST

jammu kashmir
జమ్ముకశ్మీర్

జమ్ముకశ్మీర్​లో(Jammu encounter) భద్రతాదళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఓ ఉగ్రవాది నుంచి ఏకే రైఫిల్, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.

జమ్ముకశ్మీర్​లో భద్రతాదళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. శ్రీనగర్, దక్షిణ కశ్మీర్​లోని(Jammu Encounter News) రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

తొలుత కుల్గాం జిల్లా చవల్‌గామ్‌ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు గాలింపు చేపట్టగా.. ముష్కరులు కాల్పులు జరిపారు. వారి కాల్పులను తిప్పికొట్టిన సైన్యం ఓ ఉగ్రవాదిని హతమార్చింది.

శ్రీనగర్‌ హమ్‌దనియా కాలనీలో మరో ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ముష్కరుడి నుంచి ఓ ఏకే రైఫిల్ సహా భారీస్థాయిలో మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముష్కరుల వేట కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆ ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు.

ఇదీ చదవండి:

కశ్మీర్‌లో హింసకు కళ్లెం వేసేదెలా?

Last Updated :Nov 12, 2021, 1:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.