ETV Bharat / bharat

Superstar Rajinikanth Punch Dialogue: "మొరగని కుక్క.. విమర్శించని నోరు ఉండదు.. అర్థమైందా రాజా.."

author img

By

Published : Aug 9, 2023, 3:13 PM IST

Etv Bharat
Etv Bharat

Superstar Rajinikanth Punch Dialogue: తమిళ అగ్ర నటుడు సూపర్​స్టార్​ రజనీకాంత్​ చెప్పిన డైలాగ్​ నెట్టింట వైరలవుతున్నాయి. ఆయన చెప్పిన మాటలకు ప్రేక్షకుల సందడితో సభ ప్రాంగణం మారుమోగింది. ఆయన చెప్పిన ఆ డైలాగ్​ పరోక్షంగా ఆంధ్ర రాజకీయాలను ఉద్దేశ్యించి ఉన్నాయని ఇంటర్​నెట్ ప్రియులు కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు.

Superstar Rajinikanth Punch Dialogue: రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలో రజనీకాంత్​ స్పష్టం చేశారు. అంతేకాకుండా భవిష్యత్​లోనూ రాజకీయాల్లోకి రాబోనని వివరించారు. తన ఆరోగ్యం సహకరించటం లేదని అందుకే రాజకీయ జీవితానికి దూరంగా ఉండనున్నట్లు వివరణ ఇచ్చారు. అందుకు తగినట్లుగా ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు.

రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న తలైవా.. తాజాగా చెప్పిన డైలాగ్​ మాత్రం తనను విమర్శించిన వారిని గట్టి ఎదురుదెబ్బ కొట్టినట్లుగా అనిపిస్తోంది. ఆయన చెప్పిన ప్రతి మాట విమర్శకులకు సూటిగా బాణాలు విసిరినట్లుగా అనిపిస్తున్నాయి. తనపై రాజకీయంగా విమర్శించిన వారికి.. ఈ డైలాగుల ద్వారా బదులిచ్చినట్లుగా ఉంది. ఆయన చెప్పిన డైలాగులు తాజాగా నెట్లింట్లో వైరల్​ అవుతున్నాయి.

తలైవాను అలా చూసి ఫ్యాన్స్​ ఫుల్​ ఖుష్​

Fans Reaction on Superstar Rajini Dialogue: సూపర్​ స్టార్​ రజనీ అభిమానులు ఆయన చెప్పిన డైలాగులను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఇప్పుడు తెలిసిందా రాజా.. ఎవరి కోసమో ఈ కామెంట్లు అని ఓ అభిమాని స్పందిస్తే.. మరో అభిమాని మాత్రం డైలాగులు ఎవరి కోసమైనా సూపర్​గా చెప్పారంటూ ట్వీట్​ చేశారు. చివర్లో డైలాగు తెలుగులో చెప్పారంటే తెలుగువాళ్ల కోసమేనని మరో అభిమాని సమాధానమిచ్చారు. రజనీకాంత్​ సూపర్​ మెసేజ్​ ఇచ్చారంటూ మరొకరు ట్వీట్​ చేశారు.

ఇంతకీ రజనీకాంత్​ ఏమన్నారంటే.. సూపర్​స్టార్​ రజనీకాంత్​ నటించిన జైలర్​ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ఇటీవలే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఈ లోకంలో మొరగని కుక్క ఉండదు... విమర్శించని నోరు ఉండదు... ఇవి రెండూ జరగని ఊరు ఉండదు.. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోవాలి.. అర్థమైందా రాజా" అని అన్నారు. ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో పాల్గొన్న అభిమానులు ఆయన చెప్పిన ఈ మాటలకు ఉర్రూతలూగిపోయారు.

'మార్పు రావాలి.. ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ రాదు'

Rajinikanth Dialogue Viral: రజనీకాంత్​ కౌంటర్​ ఇచ్చారని నెట్టింట వైరల్​: సూపర్​స్టార్​ రజనీకాంత్​ తనపై రాజకీయ విమర్శలు చేసినవారికి.. గట్టి కౌంటర్​ ఇచ్చేందుకే ఈ డైలాగ్​ చెప్పి ఉంటారని సామాజిక మాధ్యమాల్లో ఇంటర్నెట్​ ప్రియుల షేరింగ్​తో వైరల్​గా మారింది. గతంలో టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్​ శతజయంతి ఉత్సవాలను నిర్వహించగా.. ఆ కార్యక్రమంలో రజనీకాంత్​ పాల్గొన్నారు.

ఎన్టీఆర్​ శతజయంతి సందర్భంగా రజనీకాంత్​ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్​పై, టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఈ ప్రశంసలకు ఆయన రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో రజనీకాంత్​ వ్యాఖ్యలపై ఆంధ్ర రాజకీయంలో తీవ్ర దుమారమే రేగింది.

TDP Fires on YSRCP: "రజనీపై విమర్శలు మాని ప్రజాసమస్యలను పరిష్కరిస్తే బాగుంటుంది"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.