ETV Bharat / bharat

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం- శాలువాతో ఉరివేసి హత్య!

author img

By

Published : Jul 5, 2021, 2:47 PM IST

Updated : Jul 5, 2021, 2:56 PM IST

vandiperiyar rape case, కేరళ ఇడుక్కి వార్తలు
ఆరేళ్ల చిన్నారిపై 22 ఏళ్ల యువకుడు హత్యాచారం

కేరళలోని వండిపెరియర్​ గ్రామానికి చెందిన ఓ చిన్నారి అనుమానాస్పద మృతి కేసు మలుపు తిరిగింది. ప్రమాదవశాత్తు చనిపోయిందని భావించిన అధికారులకు దర్యాప్తులో అత్యాచారానికి గురై మృతిచెందినట్లు వెల్లడైంది.

ఆ చిన్నారి మృతి ప్రమాదవశాత్తు జరిగిందని అధికారులు భావించారు. కానీ ఆమె అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిందని దర్యాప్తులో తేలింది. ఆరేళ్ల చిన్నారిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఆమెను హత్య చేశాడో ఓ వ్యక్తి. కేరళలోని ఇడుక్కి జిల్లా వండిపెరియర్​ గ్రామంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. చిన్నారి మృతికి కారణమైన నిందితుడు అర్జున్​ (22)ను పోలీసులు అరెస్టు చేశారు.

vandiperiyar rape case, కేరళ ఇడుక్కి వార్తలు
నిందితుడు అర్జున్​

జూన్​ 30న ఓ గదిలో శాలువాకు వెళాడుతూ చిన్నారి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. చిన్నారి మెడపైన గుర్తులు పరిశీలించిన అధికారులు.. ఆమె ఆడుకుంటుండగా ఆ శాలువా మెడకు చుట్టుకుని చనిపోయి ఉంటుందని భావించారు. కానీ అనుమానాస్పదంగా ఉన్న ఆమె మృతిపై దర్యాప్తు కొనసాగించగా.. పోస్ట్​మార్టంలో ఆమె అత్యాచారానికి గురైన విషయం వెల్లడైంది. చిన్నారిపై నిందితుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడి.. చివరికి ఆమె మెడకు సాలువా చుట్టి హత్య చేశాడని ఇడుక్కి మెడికల్​ కాలేజీ వైద్యులు వెల్లడించారు.

ఇదీ చదవండి : ఆహారం ఇచ్చేందుకు వెళ్లి.. వైద్యురాలిపై అత్యాచారం!

Last Updated :Jul 5, 2021, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.