ETV Bharat / bharat

లోయలో వాహనం పడి ఆరుగురు మృతి

author img

By

Published : Feb 15, 2021, 9:23 PM IST

Updated : Feb 15, 2021, 10:01 PM IST

Six people, including a minor, killed in a road accident in Doda. Jammu and Kashmir
రోడ్డు ప్రమాదం: మైనర్​ సహా ఆరుగురు మృతి

జమ్ముకశ్మీర్​లో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మైనర్​ సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.

జమ్ముకశ్మీర్​ దోడాలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. బతుత్​-కిష్టవర్​ జాతీయ రహదారిపై రాగి నాలా వద్ద ఈ ఘటన జరిగింది. ఓ మైనర్​ సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు.

దోడా నుంచి జమ్ముకు వెళుతుండగా.. వీరి వాహనం అదుపు తప్పి 500 అడుగుల లోయలో పడిపోయింది. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఓ మైనర్​కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాద వార్త తెలుసుకుని ఖైర్ అనే స్వచ్ఛంద సంస్థ​ వలంటీర్లు.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడ్డ మైనర్​ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ప్రాణాలు కోల్పోయాడు.

ఇదీ చదవండి:ఎడతెగని ఎదురుచూపులు- ఆవిరవుతున్న ఆశలు

Last Updated :Feb 15, 2021, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.