ETV Bharat / bharat

'డిసెంబరు 15 నాటికి నిరసన స్థలాలు పూర్తిగా ఖాళీ చేస్తాం'

author img

By

Published : Dec 11, 2021, 10:06 PM IST

rakesh tikait
రాకేశ్​ టికాయిత్

Rakesh Tikait Ghazipur Border: డిసెంబరు 15 నాటికి నిరసన స్థలాలను పూర్తిగా ఖాళీ చేస్తామన్నారు రైతు నేత రాకేశ్ టికాయిత్. దిల్లీ సింఘు, టిక్రీ, గాజీపుర్​ సరిహద్దుల వద్ద శిబిరాల తొలగింపు ఇప్పటికే ప్రారంభమైంది.

Rakesh Tikait Ghazipur Border: దిల్లీ సరిహద్దుల్లో నిరసన స్థలాలను ఖాళీ చేయడానికి సంబంధించి రైతు నేత రాకేశ్​ టికాయిత్​ కీలక ప్రకటన చేశారు. డిసెంబరు 15 నాటికి రైతులు పూర్తిగా గాజీపుర్​ సరిహద్దును ఖాళీ చేసి వెళ్లిపోతారన్నారు భారతీయ కిసాన్​ యూనియన్​ నేత. ఇప్పటికే మొదటి బృందం ఉత్తరాఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​కు శనివారం తిరిగి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. రైతులందరూ సరిహద్దులను వీడాక తాను ఇంటికి చేరుకుంటాను అన్నారు టికాయిత్.

సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు సాగిన ఆందోళనలను విరమించిన రైతులు అధికారికంగా శిబిరాలను ఖాళీ చేస్తున్నారు. దిల్లీ సింఘు, టిక్రీ, గాజీపుర్​ సరిహద్దుల వద్ద శిబిరాల తొలగింపు అనధికారికంగా.. గత గురువారమే ప్రారంభమైంది. పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు ఇళ్లకు బయలుదేరారు. గుడారాలు, శిబిరాలను తొలగించి సామాన్లను స్వస్థలాలకు తరలిస్తున్నారు.

టికాయిత్​కు అవార్డు..

సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా వ్వవహరించిన రైతు నేత రాకేశ్​ టికాయిత్​కు అరుదైన గౌరవం దక్కింది. లండన్​కు చెందిన 'స్క్వేర్డ్​ వాటర్​మెలన్​ కంపెనీ' టికాయిత్​కు ఐకాన్​ ఆఫ్​ 21స్ట్​ సెంచరీ అవార్డును ప్రకటించింది.

rakesh tikait news latest
టికాయిత్​కు అవార్డు

ఇదీ చూడండి : 'ఆ జిల్లాల్లో కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించండి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.