ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో పోలీస్​ను కాల్చిచంపిన ఉగ్రవాదులు

author img

By

Published : Nov 7, 2021, 8:48 PM IST

Updated : Nov 7, 2021, 9:05 PM IST

terrorist
ఉగ్రవాదులు

20:43 November 07

జమ్ముకశ్మీర్​లో పోలీస్​ను కాల్చిచంపిన ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్​లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్​లోని బాటమలూ ప్రాంతంలో ఓ కానిస్టేబుల్​పై(29) కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పోలీస్ మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 8గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.  

టెర్రరిస్టుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్​ను స్థానికంగా ఉన్న ఎస్​ఎంహెచ్​ఎస్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనను నేషనల్ కాన్ఫరెన్స్​(ఎన్​సీ)పార్టీ ఖండించింది. ఉగ్రవాదుల దుశ్చర్యగా అభివర్ణించింది.

Last Updated :Nov 7, 2021, 9:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.