ETV Bharat / bharat

నిలకడగా మన్మోహన్ ఆరోగ్యం- కోలుకోవాలని ప్రధాని ఆకాంక్ష

author img

By

Published : Oct 14, 2021, 10:41 AM IST

Updated : Oct 14, 2021, 10:49 AM IST

manmohan singh health
మన్మోహన్ ఆరోగ్యం

జ్వరం, నీరసం కారణంగా దిల్లీ ఎయిమ్స్​లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాక్షించారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్మోహన్​ను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్ మాండవీయ పరామర్శించారు.

అస్వస్థతతో దిల్లీ ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్‌ చేసిన మోదీ.. మన్మోహన్‌కు(Manmohan Singh Latest News) మంచి ఆరోగ్యాన్నివ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు.. మన్మోహన్‌ సింగ్‌ను కలిసేందుకు కేంద్రఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఎయిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులను అడిగి మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

manmohan
మన్మోహన్​కు కేంద్రఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పరామర్శ
manmohan
మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై ప్రధాని ట్వీట్
manmohan
ఎయిమ్స్​కి వచ్చిన కేంద్రఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

సోమవారం జ్వరం బారిన పడి కోలుకున్న 89 సంవత్సరాల మన్మోహన్‌ సింగ్‌.. నీరసంతో బుధవారం సాయంత్రం ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి. ప్రత్యేక నిపుణుల బృందం మన్మోహన్‌ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించాయి.

ఇవీ చదవండి:

Last Updated :Oct 14, 2021, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.