ETV Bharat / bharat

20 రోజుల్లో ఐదు సార్లు మోదీ- జిన్​పింగ్ భేటీ

author img

By

Published : Nov 9, 2020, 9:15 PM IST

india
20 రోజుల్లో ఐదు సార్లు మోదీ- జిన్​పింగ్ భేటీ

లద్దాఖ్​లో సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గించేందుకు సైనిక, దౌత్య మార్గాల్లో ఇప్పటివరకు పలుమార్లు భారత్​-చైనా భేటీ అయ్యాయి. అయితే పరిష్కారం మాత్రం దొరకలేదు. ఇప్పుడిక అందరి దృష్టి దేశాధినేతలైన మోదీ- జిన్​పింగ్​ భేటీపైనే ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ వివిధ వేదికలపై వచ్చే 20 రోజుల్లో ఐదు సార్లు భేటీ అయ్యే అవకాశం ఉంది.

తూర్పు లద్దాఖ్​లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్​-చైనాలు బలగాలను మోహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలు వివిధ మార్గాల్లో, స్థాయిల్లో చర్చలు జరిపాయి. అయితే ఇప్పటివరకు చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఆసియాలోనే అతిపెద్ద, శక్తిమంతమైన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే ఇక మిగిలింది దేశాధినేతల భేటీనే. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ప్రధాని నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు జిన్​ పింగ్​ భేటీపైనే ఉంది.

ప్రస్తుతం రెండు దేశాల భవిత ఇరు దేశాధినేతల చేతిలోనే ఉంది. సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గేలా తగిన నిర్ణయం తీసుకునే అవకాశం వారికి దక్కింది. ఎందుకంటే వివిధ వేదికలపై వచ్చే 20 రోజుల్లో ఐదు సార్లు మోదీ-జిన్​పింగ్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

సున్నితమైన భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గాలంటే మోదీ- జిన్​పింగ్​ భేటీయే సరైన మార్గం. ఎందుకంటే బలమైన ఇద్దరు జాతీయ నాయకులు, రెండు పెద్ద దేశాలను పాలిస్తున్న దిగ్గజ నేతల చర్చతోనే సరిహద్దు వివాదంపై ఓ ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.

భేటీల వివరాలు...

  1. నవంబర్​ 10న జరగబోయే షాంఘై సహకార సదస్సులో మోదీ- జిన్​పింగ్ తొలి భేటీ జరగనుంది. వర్చువల్​ వేదికగా జరిగే ఈ చర్చను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్ ఏర్పాటు చేస్తున్నారు. భారత్​- చైనా ఇందులో శాశ్వత సభ్య దేశాలు.
  2. తరువాత రెండు రోజుల్లో నవంబర్​ 12-15 మధ్య జరగబోయే ఆసియన్ సదస్సులో మరోసారి ఇరువురు నేతలు భేటీ అవుతారు. ఈ భేటీకి వియత్నాం.. భారత్​ను ప్రత్యేకంగా ఆహ్వానించింది.
  3. నవంబర్​ 17న జరగబోయే ఐదు దేశాల బ్రిక్స్​ (బ్రెజిల్​, రష్యా, భారత్​, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సులో మోదీ-జిన్​పింగ్ మరోసారి ఎదురెదురుపడతారు. ఈ భేటీని కూడా రష్యా ఏర్పాటు చేస్తోంది.
  4. నవంబర్​ 21-22న జీ20 సదస్సు జరగనుంది. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన, పారిశ్రామిక, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇందులో సభ్యులు. భారత్​, చైనా రెండూ ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. సౌదీ అరేబియా ఈ భేటీకి ఆతిథ్యమిస్తుంది.
  5. చివరిగా నవంబర్​ 30న జరగబోయే ఎస్​సీఓ (కౌన్సిల్​ ఆఫ్​ హెడ్స్​ ఆఫ్​ గవర్నమెంట్​)లో మోదీ-జిన్​పింగ్ భేటీ అవుతారు. ఈ భేటీకి భారత్​ ఆతిథ్యం ఇస్తుంది.

అయితే వాస్తవానికి ఈ సదస్సుల్లో ఇరు దేశాధినేతలు ఎదురెదురు పడకపోవచ్చు. కానీ ఒకే వేదికలో ఒకే సమయానికి చర్చల్లో ఉంటారు. ఈ సందర్భంగా సరిహద్దు వివాదం చర్చకు వచ్చే అవకాశం ఉంది.

- సంజీవ్​ కె బారువా (సీనియర్​ జర్నలిస్ట్)

ఇదీ చూడండి: మరోసారి ఆంగ్​ సాన్​ సూకీకే మయన్మార్​ జై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.