ETV Bharat / bharat

కేంద్రం బాటలో రాష్ట్రాలు.. 'పెట్రో పన్ను' తగ్గింపు.. మరి మన సంగతేంటి?

author img

By

Published : May 22, 2022, 7:26 AM IST

Updated : May 22, 2022, 6:27 PM IST

petrol price news
petrol price news

petrol price news: కేంద్ర ప్రభుత్వం లీటర్​పై 8 రూపాయలు, డీజిల్​పై 6 రూపాయల ఎక్సైజ్​ సుంకం తగ్గిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేరళ, రాజస్థాన్​, మహారాష్ట్ర రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తుల పన్నును తగ్గించాయి. మరోవైపు కేంద్రం నిర్ణయాన్ని పాకిస్థాన్​ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్ సైతం ప్రశంసించారు.

petrol price news: పెట్రో భారం నుంచి సామాన్యులకు కాస్త ఉపశమనం కల్పించడంలో కేంద్రం బాటలోనే పయనిస్తున్నాయి పలు రాష్ట్రాలు. లీటర్​పై 8 రూపాయలు, డీజిల్​పై 6 రూపాయల ఎక్సైజ్​ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం శనివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేరళ, రాజస్థాన్​ రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తుల పన్నును తగ్గించాయి. కేరళ ప్రభుత్వం పెట్రోల్​పై 2.41 రూపాయలు, డీజిల్​పై 1.36 రూపాయలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్​ కూడా పన్నును తగ్గించింది. పెట్రోల్​పై 2.48 రూపాయలు, డీజిల్​పై 1,36 మేర తగ్గించినట్లు ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లోత్​ ట్విట్టర్​లో తెలిపారు. మరోవైపు.. మహారాష్ట్ర ప్రభుత్వం సైతం పెట్రోల్​, డీజిల్​లపై సుంకాలను తగ్గించింది. పెట్రోల్​పై లీటరుకు రూ.2.08, డీజిల్​పై లీటర్​కు రూ. 1.44లు తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర డీజీఐపీఆర్​ తెలిపింది.

మేం తగ్గించలేం: పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు తగ్గిస్తున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్​ టి. రాజన్​ స్పందించారు. అది అసంపూర్ణమేనని విమర్శించారు. రాష్ట్రాలు కూడా తగ్గిస్తాయని చూడటం.. న్యాయం కాదు, సమంజసమూ కాదని అన్నారు. ధరలు పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాల్ని కోరని కేంద్రం.. ఇప్పుడెందుకు పన్నులు తగ్గించాలని హితబోధ చేస్తోందని వ్యాఖ్యానించారు. మరోవైపు.. పెట్రోల్​, డీజిల్​పై పన్నుల తగ్గింపును పరిశీలిస్తామని అన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై.

Petrol Excise Duty: దేశంలో నిత్యావసర వస్తువులు, సహా పెట్రోల్‌, డీజిల్‌, నిర్మాణ రంగ వస్తువుల ధరలు భారీగా పెరిగిన వేళ కేంద్ర ప్రభుత్వం ఆ భారాన్ని తగ్గించే దిశగా నిర్ణయాలు తీసుకుంది. చమురు, గ్యాస్‌, నిర్మాణ రంగ వస్తువులపై సుంకాలు తగ్గించింది. లీటర్‌ పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. తాజాగా తగ్గింపుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7.. తగ్గే అవకాశం ఉంది. గత ఏడాది దీపావళి సమయంలో కూడా కేంద్రం లీటర్‌ పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించింది.

గత ఏడాది దీపావళి సమయంలో కూడా కేంద్రం లీటర్‌ పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించింది. అప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలు ఇదే తరహాలో తమ వంతు పన్ను తగ్గించాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలు స్పందించకపోగా.. పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పట్లో విజ్ఞప్తి చేశారు.

Imran khan on India petrol prices: పెట్రో సుంకాల తగ్గింపుపై భారత ప్రభుత్వం నిర్ణయాన్ని పాకిస్థాన్​ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్​ ప్రశంసించారు. అగ్రరాజ్య అమెరికా ఒత్తిడిలో పడకుండా రష్యా నుంచి రాయితీపై కొనుగోలు చేయడాన్ని సమర్థించారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో ఇలాంటి విధానాలనే ప్రోత్సహించాన్నారు.

ఇదీ చదవండి: 'దేశంపై భాజపా కిరోసిన్ చల్లింది.. ఒక్క నిప్పురవ్వ చాలు..'

Last Updated :May 22, 2022, 6:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.