ETV Bharat / bharat

కరోనా వల్ల 22 ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు..

author img

By

Published : Apr 30, 2021, 5:00 PM IST

Shankar, Karnataka
శంకర్​

దాదాపు 22 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఓ వ్యక్తి.. కరోనా కారణంగా ఎట్టకేలకు తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. 16ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయిన అతడు.. గుజరాత్, ఆంధ్రప్రదేశ్​, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లో కాలం గడిపి చివరకు ఇంటికి తిరిగొచ్చాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

కొద్ది కాలంగా దేశ ప్రజల్ని పట్టిపీడిస్తోన్న కొవిడ్​ మహమ్మారి.. కర్ణాటకలోని ఓ కుటుంబంలో మాత్రం ఆనందం నింపింది. హసన్​ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. 22 సంవత్సరాల క్రితం అదృశ్యమై.. ఎట్టకేలకు ఇప్పుడు ఇంటికొచ్చాడు. కరోనా కారణంగా ఉపాధి కరవై సొంతగూటికి పయనమై.. ఇటీవలే తన కుటుంబాన్ని కలిశాడు. దీంతో ఆ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.

Reunite man Shankar and his family
కుటుంబ సభ్యులతో శంకర్

ఇదీ జరిగింది..

హొంగెరె గ్రామానికి చెందిన శంకర్​.. తన 16ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి తల్లిదండ్రులు(రాజేగౌడ, అక్కాయమా) సుమారు ఏడాది కాలం పాటు వెతికారు. పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో తీవ్ర నిరాశకు గురై వారి కుమారుడు తిరిగొస్తాడనే ఆశల్ని వదులుకున్నారు.

అలా అదృశ్యమైన శంకర్​.. ఆంధ్రప్రదేశ్​లో పానీపూరీ వ్యాపారం చేస్తూ జీవనం సాగించాడు. ఆ తర్వాత గుజరాత్​, మధ్యప్రదేశ్​లోని వివిధ ప్రాంతాల్లో పనిచేశాడు. అంతకుముందు.. దుబాయ్​కూ వెళ్లాడట.

అయితే.. కరోనా కారణంగా అతడి వ్యాపారం దెబ్బతినడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం వల్ల.. ఇంటికి తిరుగు పయనమయ్యాడు. సుదీర్ఘ కాలం తర్వాత శంకర్​ను చూసిన వారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇదీ చదవండి: కరోనా కాలంలో చేయాల్సినవి.. చేయకూడనివి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.