ETV Bharat / bharat

అక్కడ ప్రతి 20 నిమిషాలకు ఓ పోలీసుకు కరోనా

author img

By

Published : May 5, 2021, 8:20 PM IST

Delhi police
దిల్లీ పోలీస్​

దేశ రాజధానిలో ప్రతి 20 నిమిషాలకు ఓ పోలీస్​ కరోనా బారినపడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత రెండు నెలల్లోనే 4,200 మంది పోలీసులకు వైరస్​ సోకగా.. 25 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు.. కేరళ మున్నార్​లో 100మంది క్రైస్తవ మతబోధకులకు కరోనా సోకింది.

దిల్లీలో కరోనా విజృంభణకు పోలీసులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతి 20 నిమిషాలకు ఓ పోలీస్ వైరస్ బారిన పడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత రెండు నెలల్లోనే 4,200 మందికి కరోనా సోకింది. వారిలో 25 మంది చనిపోయారు. ఇప్పటివరకు మొత్తం 11,500 మంది దిల్లీ పోలీసులకు పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. 59 మంది పోలీసులు మరణించినట్లు పేర్కొన్నారు.

లెఫ్టినెంట్​ గవర్నర్ భద్రతా సిబ్బంది యూనిట్​లోని 145 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. ప్రధాన మంత్రి భద్రతా విభాగంలో విధులు నిర్వహించే 65 మంది పోలీసులూ బాధితులయ్యారు. ఓ ప్రత్యేక కమిషనర్, ముగ్గురు జాయింట్ కమిషనర్లు, ఆరుగురు డీసీపీలకు ఇటీవలే వైరస్​ సోకింది. దిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో 100 మందికిపైగా పాజిటివ్​గా తేలింది.

ఈ నేపథ్యంలో కరోనా చికిత్స తీసుకుంటున్న పోలీసుల ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కమిషనర్​ ఎస్​ఎన్ శ్రీవాస్తవ అధికారులను అదేశించారు.

100మంది క్రైస్తవ మతబోధకులకు..

కేరళ మున్నార్​లో 100మంది క్రైస్తవ మతబోధకులకు కరోనా సోకింది. గత నెలలో నిర్వహించిన యానువల్​ రిట్రీట్​లో 480 మందికిపైగా మతబోధకులు పాల్గొన్నారని, ఎవరూ బౌతిక దూరం, మాస్కులు ధరించలేదని తమదృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కరోనా సోకి ఇద్దరు చనిపోయారని, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఏప్రిల్​ 13 నుంచి 17 మధ్య జరిగిన ప్రార్థనా సమావేశాల్లో వీరంతా పాల్గొన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: 'కరోనా మూడోదశ అనివార్యం- ఎదుర్కొనేందుకు సిద్ధం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.