ETV Bharat / bharat

క్లాస్​-12లో టాపర్​.. 'నీట్​ ఫెయిల్'​ భయంతో ఆత్మహత్య

author img

By

Published : Sep 14, 2021, 3:24 PM IST

NEET Exam
నీట్​ పరీక్ష బాగా రాయలేదని విద్యార్థిని ఆత్మహత్య

నీట్​ పరీక్ష(NEET 2021) సరిగ్గా రాయలేదన్న మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని అరియాలుర్​ జిల్లాలో సోమవారం జరిగింది. ఈ విద్యార్థిని కొన్ని నెలల క్రితం విడుదలైన 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో 93.6 శాతం ఉత్తీర్ణత సాధించింది.

12వ తరగతిలో 93.6 శాతం ఉత్తీర్ణతతో టాపర్​గా నిలిచిన ఓ విద్యార్థిని.. నీట్​ పరీక్ష బాగా రాయలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని అరియాలుర్​ జిల్లా చాతంబడి గ్రామంలో సోమవారం జరిగింది.

ఆదివారం నాడు నీట్​ పరీక్ష (NEET 2021) రాసిన కనిమొళి.. తాను పరీక్ష బాగా రాయలేదని తండ్రితో చెప్పింది. డాక్టర్​ కావాలన్న తన కల నెరవేరదని మనస్తాపం చెందిన ఆ బాలిక.. సోమవారం నాడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే.. ఈ విద్యార్థిని కొన్ని నెలల క్రితం విడుదలైన 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో 93.6 శాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.

ఇటువంటిదే మరో ఘటన ఆదివారం జరిగింది. సేలం జిల్లాకు చెందిన ధనుష్​ అనే విద్యార్థి.. నీట్​ పరీక్ష సరిగ్గా రాయలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

తమిళనాడు ప్రభుత్వం కూడా నీట్​కు సంబంధించి ప్రత్యేక బిల్లును అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టింది. మెడికల్​ కాలేజీల్లో అడ్మిషన్​ కోసం నీట్​ నుంచి మినహాయింపు ఇవ్వాలని బిల్లులో పేర్కొంది.

ఇదీ చూడండి : దీదీ నామినేషన్​ తిరస్కరించాలని ప్రియాంక డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.